DNA Test: గూఢచారి పావురానికి డీఎన్‌ఏ పరీక్ష

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా వద్ద లభించిన గూఢచారి పావురం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసు కమ్యూనికేషన్‌ విభాగం దర్యాప్తు జరుపుతోంది.

Updated : 12 Mar 2023 08:39 IST

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా వద్ద లభించిన గూఢచారి పావురం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసు కమ్యూనికేషన్‌ విభాగం దర్యాప్తు జరుపుతోంది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా దాని ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పావురానికి అమర్చిన కెమెరా, మెమొరీ చిప్‌పై ఇప్పటికే భువనేశ్వర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో దర్యాప్తు కొనసాగుతోంది. పావురం రెక్కలపై విదేశీ భాషలో రాసి ఉన్న అక్షరాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. పావురం పొడవు, శరీరం శైలి పరిశీలిస్తే అది ఏ ప్రాంతానికి చెందిందో తెలుస్తుందని పోలీసు పావురాల విభాగం మాజీ అధికారులు అంటున్నారు. ఇది శిక్షణ పొందిన పావురమని అనుమానిస్తున్నారు. వివరాలు సేకరించాక, తిరిగి పంపినవారి వద్దకు చేరుకుంటుంది. కొత్తగా శిక్షణ పొందినది కావడం వల్ల తిరిగివెళ్లే దిశ మరిచిపోయి, సముద్ర ప్రాంతంలో తిరుగుతూ మత్స్యకారుల చేతికి చిక్కిందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని