జంతర్మంతర్ వద్దే దీక్ష
జంతర్మంతర్వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండు చేసింది.
అక్కడే అనుమతించాలి
బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలి
సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్
దిల్లీ: జంతర్మంతర్వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండు చేసింది. రెజ్లర్లకు మద్దతుగా గురువారం దేశవ్యాప్తంగా మోర్చా ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా మెమోరాండాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపింది. జంతర్మంతర్లో ఆందోళనకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమెను కోరింది. భారత పుత్రికల గౌరవాన్ని కాపాడాలని, నెల రోజులుగా సాగుతున్న ఆందోళనకు త్వరగా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేసి విచారించాలని, తద్వారా ఛార్జిషీట్ను త్వరగా కోర్టులో నివేదించవచ్చని సూచించింది. దిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. పంజాబ్, హరియాణాల్లో ఆందోళనకారులు డిప్యూటీ కమిషనర్లు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్లకు వినతి పత్రాలను అందించారు. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని కోరారు. భారతీయ కిసాన్ యూనియన్ (లఖోవాల్), భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహన్) తదితర 30 సంఘాలు 16 చోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించాయి. చండీగఢ్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ జరిపారు.
* రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో గురువారం భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని పికెట్లు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చిన వాహనాలను తనిఖీ చేశాకే పంపించారు.
* క్రీడా ప్రదేశాల్లో మహిళా క్రీడాకారుల భద్రతకు సంబంధించిన అంశంపై చర్చించనందుకు నిరసనగా తృణమూల్ ఎంపీలు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం నుంచి వాకౌట్ చేశారు. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఏర్పాటైన స్థాయీ సంఘం సమావేశం గురువారం దిల్లీలో జరిగింది. అందులో మహిళా క్రీడాకారుల భద్రతపై చర్చించాలని తృణమూల్ ఎంపీలు దేవ్, అసిత్ కుమార్ పట్టుబట్టారు. అయితే ఎజెండాలో లేనందున చర్చించలేమని ఛైర్మన్ స్పష్టం చేశారు. దీంతో వారు వాకౌట్ చేశారు.
* రెజ్లర్లకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బుధవారం కోల్కతాలో ర్యాలీ నిర్వహించిన ఆమె గురువారమూ వీధుల్లోకి వచ్చారు. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించొద్దని రెజ్లర్లకు సూచించారు.
* రెజ్లర్ల అంశాన్ని హరియాణా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీనియర్ కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించవద్దని హితవు పలికారు.
* మహిళల ఫిర్యాదులను వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని, ఆ తర్వాత అధికారులు విచారణ జరిపి నిజానిజాలను నిగ్గు తేలుస్తారని భాజపా ఎంపీ ప్రీతం ముండే అభిప్రాయపడ్డారు. రెజ్లర్ల కేసులో చర్యలు ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బీడ్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
జాగ్రత్తగా చూస్తున్నాం: ఠాకుర్
రెజ్లర్ల అంశాన్ని జాగ్రత్తగా చూస్తున్నామని, వారు డిమాండు చేసినట్లుగా విచారణకు కమిటీని నియమించామని కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. వారి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని గురువారం ముంబయిలో చెప్పారు.
రెజ్లర్ల డిమాండ్లు మారుతున్నాయ్: బ్రిజ్ భూషణ్
గోండా: ఆందోళన మొదలైనప్పటి నుంచి రెజ్లర్ల డిమాండ్లు మారుతూ వస్తున్నాయని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానిని పూర్తి చేయనివ్వండి. అందులో ఏం తేలినా నేను కట్టుబడి ఉంటా’ అని ఆయన గురువారం యూపీలోని గోండాలో పేర్కొన్నారు. అనవసర ప్రశ్నలు అడగొద్దని ఆయన విలేకరులకు చేతులెత్తి నమస్కరించారు. రెజ్లర్ల ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకోవడానికైనా సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్రపతిని కలుస్తాం: టికాయిత్
ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్పుర్లో గురువారం ఖాప్ పంచాయతీ జరిగింది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతిని కలవాలని అందులో రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఖాప్ పంచాయతీ జరిగిందని, శుక్రవారం కురుక్షేత్రలో మరోసారి సమావేశమవుతున్నామని, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నేత టికాయిత్ తెలిపారు. రెజ్లర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?