MSP: రైతన్నకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వరికి మద్దతు ధర పెంపు

అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

Published : 08 Jun 2022 17:26 IST

దిల్లీ: అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

* సాధారణ వరి క్వింటాల్‌ కనీస మద్దతు ధరను రూ.100 పెంచారు. దీంతో క్వింటాల్‌ ధర రూ.2,040కి చేరింది.

* నువ్వుల కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ. 523 పెరిగింది.

* పెసర్లపై రూ.480 (క్వింటాల్‌కు) ఎంఎస్‌పీ పెంచారు.

* పొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.385 పెరిగింది.

మినుములపై మద్దతు ధర క్వింటాల్‌కు రూ.300 పెంచారు.

* మధ్య రకం పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.354 పెరిగింది.

* సోయాబీన్‌ మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.350 పెంచారు.

* కందుల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.300 పెంచారు.

* హైబ్రీడ్‌ జొన్నల మద్దతు ధర క్వింటాల్‌పై రూ.232 పెరిగింది.

* సజ్జల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెరిగింది.

* మొక్కజొన్న మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.92 పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని