Corona:హైఫై మాస్క్ వ్యాక్సిన్లా పనిచేస్తుంది
కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఉపయోగించే ప్రధాన ఆయుధం మాస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో హైఫై మాస్క్ మరింత రక్షణ ఇస్తుందని వైరస్ నిరోధక వ్యూహ నిపుణులు దేవభక్తుని శ్రీ కృష్ణ సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఉపయోగించే ప్రధాన ఆయుధం మాస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో హైఫై మాస్క్ మరింత రక్షణ ఇస్తుందని వైరస్ నిరోధక వ్యూహ నిపుణులు దేవభక్తుని శ్రీ కృష్ణ సూచిస్తున్నారు. 2014 నుంచి ఎబోలా మొదలు ఎన్నో వైరస్ల నియంత్రణలో కీలక పాత్ర వహించిన శ్రీ కృష్ణ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరోనాను ఎలా కట్టడి చేయాలన్న అంశం మీద తన ఆలోచనలను ‘ఈటీవీ’తో పంచుకున్నారు.
హైఫై మాస్క్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి?
హై లెవెల్ ఫిల్టరేషన్, హై ఫిట్ మాస్క్లను హైఫై మాస్కులు అని పిలుస్తారు. మనం మాట్లాడేటపుడు, గాలి పీల్చేటపుడు అతి చిన్న పార్టికల్స్ బయటకు వస్తాయి. ఆ పార్టికల్స్లో వైరస్ ఉంటే అది ఇతరులకు వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కన్నా ఇండోర్లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హై ఫిల్టరేషన్, హైఫిట్ మాస్క్లను వాడటం వల్ల వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. బట్టతో చేసిన మాస్క్ పెద్ద పార్టికల్స్ని మాత్రమే అడ్డుకోగలవు. 1 నుంచి 10 మైక్రాన్ సైజులో ఉన్న పార్టికల్స్ను బట్ట మాస్క్ అడ్డుకోలేదు. హైఫై మాస్క్లో ఉన్న ఎలక్ట్రోస్టాటికల్ చార్జ్ ఫిల్టర్ ఆ చిన్న చిన్న పార్టికల్స్ను సమర్థంగా అడ్డుకుంటుంది.
మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వదిలిన గాలి మళ్లీ తానే పీల్చుతాడు. అది ఎంత వరకూ ఆరోగ్యకరం. దానికి ప్రత్యమ్నాయం ఏమైనా ఉందా?
బయట దొరికే సాధారణ మాస్క్ పెట్టుకోవడం వల్ల గాలి ఫిల్టర్ అవ్వదు. హైఫై మాస్క్ పెట్టుకుని గాలి పీల్చినపుడు పార్టికల్స్.. మాస్క్ లేయర్స్కు అతుక్కుపోతాయి. దాని వల్ల స్వచ్చమైన గాలి లభిస్తుంది.
సెకండ్ వేవ్లో ఇమ్యూన్ సిస్టం బాగుంటే కరోనాను జయించవచ్చని అంటున్నారు డాక్టర్లు. దీని మీద మీ అభిప్రాయం?
ఇది కొంత వరకూ నిజమే. ఇమ్యూన్ సిస్టం బాగున్న వాళ్లకు వైరస్ సోకితే త్వరగానే కోలుకుంటున్నారు. అయితే ఒక సారి కరోనా సోకితే ఇమ్యూన్ సిస్టం పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వైరస్ సోకకుండా ఉండటానికి హైఫై మాస్క్ పెట్టుకోవాలి. హైఫై మాస్క్ అనేది ఒక రకంగా వ్యాక్సిన్లా పనిచేస్తుంది.
డబుల్ మాస్క్ ధరిచండం సురక్షితమేనా? రెండు సర్జికల్ మాస్కులు పెట్టుకోవచ్చా?
పెట్టుకోవచ్చు.. అయితే ఎన్95 అందుబాటులో లేకపోతే డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. కొంతమంది సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ పెట్టుకుంటారు. అలాంటి వాళ్లు తప్పని సరిగా సర్జికల్ మాస్క్ మీద క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. డబుల్ మాస్కులు ధరిస్తే 75 శాతం మాత్రమే వైరస్ నుంచి రక్షణ ఉంటుంది.
కరోనా సెకండ్ వేవ్లో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పిల్లలైనా, పెద్దలైనా ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకకుండా ఉండాలంటే హైఫై మాస్క్ పెట్టుకోవాలి. పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన హైఫై మాస్క్లు ఉన్నాయి. అవి వాడటంవల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవు.
హైఫై మాస్క్లు ఎక్కడ దొరుకుతాయి?
ప్రస్తుతం చాలా రకాల మాస్కులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్95, కొరియా మాస్క్ కేఎఫ్ 94, ఐరోపా మాస్క్ ఎఫ్ఎఫ్పి-2 వంటి మాస్క్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం Patient Knowhow వెబ్సైట్ చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్