IND-AUS మధ్య విమాన సేవలు పునఃప్రారంభం

భారత్‌- ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.  కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన విమానాలపై ఆస్ట్రేలియా

Published : 15 May 2021 16:08 IST

కాన్‌బెర్రా: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.  కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం గడువు మే 14 అర్ధరాత్రితో ముగియడంతో ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో 80మంది ప్రయాణికులతో భారత్‌ నుంచి బయల్దేరిన విమానం ఆస్ట్రేలియాకు చేరుకుంది. 

విమానాల నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాట్లాడుతూ.. క్వారంటైన్‌ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని తెలిపారు. తద్వారా మూడో వేవ్‌ రాకుండా నిలువరించగలిగామని అభిప్రాయపడ్డారు. మే 3న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారతదేశంలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా విధిస్తామంటూ హెచ్చరించడం ఇటీవల సంచలనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని