India Corona: 12 వేలకు దిగొచ్చిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. ముందురోజు వెయ్యి లోపులో నమోదైన కొత్త కేసులు.. తాజాగా 800 దిగువకు చేరాయి. 50కి పైగా మరణాలు సంభవించాయి.

Published : 05 Apr 2022 10:10 IST

మరోరోజు వెయ్యి దిగువనే కొత్త కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. ముందురోజు వెయ్యి లోపే నమోదైన కొత్త కేసులు.. తాజాగా 800 దిగువకు చేరాయి. 50కి పైగా మరణాలు సంభవించాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

సోమవారం 4 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..795 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.17 శాతానికి చేరుకుంది. కేరళ మునుపటి గణాంకాలను సవరించడంతో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 58 మరణాలు నమోదయ్యాయి. అందులో కేరళ వాటానే 56. ఇక నిన్న 1,280 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు మరింత తగ్గి.. 12వేలకు దిగొచ్చాయి. 2020 ఏడాది ప్రారంభం నుంచి 4.30 కోట్ల కరోనా కేసులు రాగా.. అందులో రికవరీ రేటు 98.76 శాతానికి చేరి ఊరటనిస్తోంది. క్రియాశీల రేటు 0.03 శాతానికి క్షీణించింది. మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇక నిన్న 16 లక్షలమంది టీకా తీసుకోగా.. 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని