India Corona: 15 వందలకు దిగొచ్చిన కొత్త కేసులు

దేశంలో కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా 15 వందలకు దిగొచ్చి ఊరటనిస్తున్నాయి. క్రియాశీల కేసులు 16 వేలకు పడిపోయాయి.

Published : 17 May 2022 09:48 IST

దిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 15 వందలకు దిగొచ్చి ఊరటనిస్తున్నాయి. క్రియాశీల కేసులు 16 వేలకు పడిపోయాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

సోమవారం 3.57 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,569 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 600 మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజివిటీ రేటు 0.44 శాతానికి చేరింది. ఇటీవల కాలంలో రోజువారీ కేసులు మూడు వేల ఎగువకు చేరి ఆందోళన కలిగించాయి. నాలుగో వేవ్ గురించి వార్తలు వచ్చాయి. కానీ కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 2,467 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా..98.75 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 16,400కు తగ్గిపోగా.. ఆ రేటు 0.04 శాతంగా ఉంది. నిన్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5.24 లక్షలు దాటింది. తాజాగా 10.8 లక్షల మంది టీకా తీసుకోగా.. గతేడాది ప్రారంభం నుంచి 191 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని