India Corona: 19 వేలకు చేరువగా రోజువారీ కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు 19 వేలకు చేరువగా నమోదయ్యాయి. ప్రస్తుత విజృంభణతో క్రియాశీల కేసులు లక్షా 20 వేలకు సమీపించాయి.

Published : 07 Jul 2022 10:16 IST

4.32 శాతంగా పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నేడు కొత్త కేసులు 19 వేలకు చేరువగా నమోదయ్యాయి. ప్రస్తుత విజృంభణతో క్రియాశీల కేసులు లక్షా 20 వేలకు సమీపించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. బుధవారం 4.38 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..18,930 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు ఆ సంఖ్య 16 వేలుగా ఉంది. పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదైంది. ఒక్క కేరళలో నాలుగువేలకుపైగా కేసులొచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్లు విస్తరిస్తున్నాయి.

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.35 కోట్ల మందికి పైగా కరోనా సోకింది. వారిలో 4.29 కోట్ల మందికి పైగా వైరస్‌ నుంచి బయటపడ్డారు. నిన్న 14,650 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.27 శాతానికి చేరింది. బాధితుల సంఖ్య(క్రియాశీల కేసులు) 1,19,457కి ఎగబాకింది. 24 గంటల వ్యవధిలో 35 మరణాలు సంభవించాయి. ఇక నిన్న 11.4 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 198 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని