9/11 attacks : ఆ రక్తపు మరకలకు రెండు దశాబ్దాలు!
అమెరికాలో అల్ ఖైదా పిడివాదుల నరమేధం జరిగి.. 2 దశాబ్దాలు పూర్తి కాగా.. ఆ రక్తపు మరకలు చెరిపేసేందుకు అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాలు చేసి ఏం సాధించింది?
కళ్ల ముందే వందల అంతస్తుల భవంతులు కుప్పకూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అగ్రరాజ్య ఆధిపత్యంపై పోరాటమంటూ ఉగ్రవాదులు చేపట్టిన ఆ మారణహోమం.. కొన్ని వేలమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. రక్షణ వ్యవస్థ పరంగా బలమైన దేశంగా భావించే అమెరికాలో అల్ ఖైదా ముష్కరుల నరమేధం జరిగి.. 2 దశాబ్దాలు పూర్తి కాగా.. ఆ రక్తపు మరకలు చెరిపేసేందుకు అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.
కోలుకోలేని దెబ్బకొట్టాలని వ్యూహరచన..
దర్పానికీ.. ఆధిపత్యానికీ చిహ్నంగా ఎత్తైన భవంతుల్ని పరిగణిస్తారు. ఆ ప్రాంతానికే తలమానికంగా నిలిచే ఆకాశహర్మ్యాలతో తమ ఘనత చాటుకునే ప్రయత్నం చేస్తాయి చాలా దేశాలు. సరిగ్గా ఆ అంశంపైనే అగ్రరాజ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసింది అల్ఖైదా. అమెరికాకు కీలకమైన నాలుగు భవంతుల్ని కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బకొట్టాలని ఉగ్రవాదులు భావించారు. పాకిస్థానీ మిలిటెంట్ ఖలీల్ అహ్మద్ షేక్ వ్యూహ రచనలో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. సెప్టెంబరు 11, 2001న 4 విమానాలను పథకం ప్రకారం హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి ప్రఖ్యాత భవంతులపై దాడులకు పాల్పడ్డారు.
మారణహోమంలో 2,996 మంది మృతి..
మ్యాన్హాటన్లో ‘ట్విన్ టవర్స్’గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులను నిమిషాల వ్యవధిలో కూల్చేశారు. ఈ ప్రదేశంలోనే విమానంలోని ఉగ్రవాదులు, ప్రయాణికులు కూలిన భవనాల కింద చిక్కుకొని మృతిచెందారు. మొత్తం 2,763 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మూడో విమానం పెంటగాన్లో అమెరికా రక్షణ కార్యాలయంలోని ఓ భవంతిని ఢీకొట్టగా.. శ్వేతసౌధం లక్ష్యంగా సాగిన నాలుగో విమానం సోమర్సెట్ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి.
నెల వ్యవధిలోనే అమెరికా ప్రతీకార దాడులు..
2001, అక్టోబర్ 7న అమెరికా నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న అఫ్గాన్ సరిహద్దులపై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తాలిబన్లను గద్దెదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమిద్ కర్జాయ్ను దేశాధ్యక్షుడిగా నియమించింది. దేశ పాలన, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల పాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అయితే, తాలిబన్లు, అల్ఖైదా తీవ్రవాదులపై ఎన్నో దాడులు చేసినా.. ఎంతమందిని హతమార్చినా లాభం లేకపోయింది. పశ్చిమ పాకిస్థాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు తిరిగి సంఘటితమయ్యారు. 2002 నుంచే ఎదురు దాడులు ప్రారంభించారు. ఫలితంగా 3,500 మంది నాటో సైనికులు చనిపోయారు. వీరిలో అమెరికా మిలిటరీ సిబ్బందే 2,300 మంది వరకు ఉన్నారు. మరో 20,660 మంది అమెరికా సైనిక సిబ్బంది క్షతగాత్రులయ్యారు.
2 లక్షల కోట్ల డాలర్లు వ్యయం..
అఫ్గాన్లో 2001, అక్టోబర్ 7న మొదలైన అమెరికా-నాటో దాడులు 20ఏళ్ల పాటు కొనసాగాయి. అప్పటి నుంచి 93,527 వైమానిక దాడులు జరిగాయని పెంటగాన్ వెల్లడించింది. 20 వేల మంది ఉగ్రవాదుల్ని హతమార్చామని పేర్కొంది. అయితే, ఈ సంఖ్యపై రక్షణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దాడుల్లో 48 వేల మంది అఫ్గాన్ పౌరులు కూడా మరణించారు. సైనిక చర్యకు, అమెరికా పునఃనిర్మాణానికి అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. జర్మనీ, భారత్, బ్రిటన్ తదితర దేశాలూ భారీగా ఖర్చు చేశాయి. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.
పాకిస్థాన్, టర్కీ దన్నుతో తాలిబన్ల ఎదురుదాడులు..
పాక్లో అబోటాబాద్లో తలదాచుకున్న లాడెన్ను 2011, మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే, పాక్లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్ఖైదా నేతలనుగానీ, తాలిబన్లనుగానీ అంతమొందించలేకపోయింది. అంతర్యుద్ధ సమస్య పరిష్కరించలేకపోయింది. ఇంకోవైపు అఫ్గాన్ పాలకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. అఫ్గాన్ సైన్యానికీ, పోలీసు బలగాలకూ అమెరికా, భారత్ శిక్షణనిచ్చాయి. కానీ, వారిని సరైన దిశలో వినియోగించుకోవడంలో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, ఆయన ప్రభుత్వం, సైన్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇంకోవైపు నాటో దాడుల్లో ప్రాణనష్టం జరిగినా తాలిబన్లు పూర్తిగా వెనక్కి తగ్గలేదు. పాకిస్థాన్, టర్కీ పరోక్ష దన్నుతో ఎదురుదాడులు కొనసాగించారు. అమెరికా దాడులు తరచూ లక్ష్యాలు తప్పి అమాయక పౌరులను బలిగొనడంతో అధ్యక్షుడు కర్జాయ్ అప్పట్లో తీవ్రంగా నిరసించారు. రక్షణ బాధ్యతల్ని తమకే అప్పగించాలని.. అమెరికా సేనల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందుకే ఆయన స్థానంలో ఘనీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. ఈయన ఏలుబడిలో పరిస్థితులు మరింత దిగజారాయి.
చేసేది లేక శాంతి ఒప్పందం..
సైనిక నష్టం నానాటికీ పెరగడం.. స్వదేశంలో నిరసనలు హెచ్చుమీరడంతో అమెరికా.. తాలిబన్లతో శాంతిచర్చలకు సిద్ధమైంది. చివరకు అఫ్గాన్ భూభాగంలో అమెరికా సైన్యం ఉండరాదన్న షరతుకు తలొగ్గి నిరుడు ఫిబ్రవరి 29న వారితో శాంతి ఒప్పందం కుదుర్చుకొంది. అయితే, ఈ శాంతిప్రక్రియలో అఫ్గాన్ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకపోవడంతో ఘనీ సర్కార్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. అయితే, గత ఏడాది నుంచి తాలిబన్లపై అమెరికా, నాటో దళాలు వైమానిక దాడులను నిలిపివేశాయి. అఫ్గాన్ సేనలు మాత్రమే పోరాడాయి. కానీ, ఘనీ బృందంలోని పలువురు నేతలు తాలిబన్లతో చేతులు కలిపారు. ఫలితంగా సైన్యానికి మార్గనిర్దేశం చేసేవారే కరవయ్యారు. దీంతో సైనికుల్లోనూ నిర్లిప్తత పెరిగింది. పోరాడకుండానే తాలిబన్లకు లొంగిపోయారు.
20 ఏళ్ల పోరాటం ఎందుకోసం? ఎవరికోసం?
ఉగ్రవాదులపై పోరులో భాగంగా ఘన విజయం సాధించామని చెప్పుకొంటున్న అమెరికా ఈ 20 ఏళ్లలో సాధించింది ఏంటంటే.. శూన్యం అన్న విమర్శలే వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం కంటే మరింత బలంగా తాలిబన్లు అఫ్గానిస్థాన్లో అధికారాన్ని చేపట్టారు. షరియా వంటి కఠినమైన చట్టాల్ని అమలు చేస్తామని స్పష్టమైన సంకేతాలూ ఇస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేశారు. మరి ఈ 20 ఏళ్ల పోరాటం ఎందుకోసం? ఎవరికోసం? అనేవి సమాధానం లేని ప్రశ్నలే!!
అఫ్గాన్ పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా చెబుతోంది. మిలిటెంట్ నెట్వర్క్లను అణచివేసేందుకు తాలిబన్లకు సాయపడతామని వివరిస్తోంది. సాలేహ్, మసూద్ నేతృత్వంలోని కూటమిపై పోరాడేందుకు తాలిబన్లకు సహకరిస్తే.. అది అగ్రరాజ్యానికే చేటు చేస్తుంది. అమెరికా కారణంగానే అఫ్గాన్లోకి తాలిబన్లు అడుగు పెట్టారు. బలగాల ఉపసంహరణ విషయమై.. గతంలోనే తాలిబన్లతో అమెరికా ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా జాగ్రత్త పడింది.
-కెప్టెన్ అనిల్ గౌర్, రక్షణరంగ నిపుణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..