కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

ఇండోనేసియాలో కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర సహాయక బృందాలు.........

Updated : 29 Feb 2024 14:07 IST

జకార్తా : ఇండోనేసియాలో కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర సహాయక బృందాలు.. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు కొండ ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని