Xi Jinping: షీజిన్పింగ్ ప్లాన్ల వెనుక అతడు..!
చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్ పట్టుకొని ఒక బక్కపలచని వ్యక్తి ఆయన సమీపలోనే ఉంటాడు. అతని పేరు వాంగ్ హుయినింగ్.. ఈ పేరు వార్తల్లో చాలా తక్కువగా
చైనా అధ్యక్షుడి నీడగా వాంగ్ హుయినింగ్..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్ పట్టుకొని ఒక బక్కపలచని వ్యక్తి ఆయన సమీపంలోనే ఉంటాడు. అతని పేరు వాంగ్ హుయినింగ్.. ఈ పేరు వార్తల్లో చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. చైనా కమ్యూనిస్టుపార్టీలోని అత్యంత శక్తివంతమైన ఏడుగురు నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా మాజీ ఎన్ఎస్ఏ హెన్రీ కిసెంజర్కు ఉన్న తెలివితేటలు.. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ సమర్థత కలిపితే వాంగ్ హుయినింగ్ అంటారు విశ్లేషకులు. జిన్పింగ్కు తొలిటర్మ్ పాలన సమయంలో నీడవలే వెన్నంటే ఉన్నారు. జిన్పింగ్ భారత్లోని గుజరాత్ పర్యటనలో వాంగ్ ఉండటం విశేషం. చైనాలో నిర్వహించే ప్రతి కీలక కార్యక్రమం వెనుక ఈయన వ్యూహరచన ఉంటుంది. వాంగ్ రాజకీయ కుటుంబంలో పుట్టలేదు.. రాజకీయాల నుంచి రాలేదు.. ఆయనో విద్యావేత్త.. కానీ, తన మేధస్సుతో, ప్రసంగాలతో ముగ్గురు చైనా అధ్యక్షులు తనపై ఆధారపడేట్లు చేసుకొన్నాడు.
అమెరికా లోపాలను అధ్యయనం చేసి..
షాంఘై విశ్వవిద్యాలయం నుంచి 1974లో ఫ్రెంచి భాషలో పట్టా పొందిన వాంగ్ హుయినింగ్.. ఆ తర్వాత ఫుడాన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలపై పీజీ చేశారు. 1985లో అదే విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత 1988లో విజిటింగ్ స్కాలర్గా అమెరికాలోని ఐయోవా యూనివర్శిటీకి వెళ్లారు. ఆ తర్వాత అమెరికాలోని 30 నగరాలు, 20 విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి సమాజంలో వైరుధ్యాలు, లోపాలపై ‘‘అమెరికా అగైనెస్ట్ అమెరికా’’ అనే పుస్తకం రాశారు. దీనిలో అమెరికాలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లోని లోపాలు.. ఉత్తుత్తి తళుకులను ప్రస్తావించారు. 2021లో అమెరికా క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ఈ పుస్తకానికి మళ్లీ డిమాండ్ వచ్చింది.
1990ల్లో వాంగ్ ప్రతిభను నాటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ గమనించారు. వెంటనే సీసీపీ సెంట్రల్ పాలసీ రీసెర్చి ఆఫీస్లోకి ఆయన్ను తీసుకొన్నారు. 1998 నాటికి ఆ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్గా.. 2002 నాటికి డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. జియాంగ్జెమిన్ ‘త్రీ రిప్రజెంటేటీవ్స్’భావజాలం తయారీలో వాంగ్ పాత్ర చాలా ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడు హు జింటావోకు కూడా నమ్మిన బంటుగా వ్యవహరించాడు. హుంజింటావో ‘సైంటిఫిక్ అవుట్ లుక్ ఆన్ డెవలప్మెంట్’ ఐడియాలజీ కూడా వాంగ్ మెదడు నుంచి పుట్టిందే.
ప్రత్యర్థుల మనిషి అయినా.. జిన్పింగ్కు అనుచరుడే..!
చైనా కమ్యూనిస్టు పార్టీలోని జియాంగ్ జెమిన్ వర్గానికి చెందిన షాంఘై గ్యాంగ్ మనిషిగా వాంగ్ను చూస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు షీజిన్పింగ్కు ఇది ప్రత్యర్థి వర్గం. జిన్పింగ్ పగ్గాలు చేపట్టాక.. ఈ వర్గం వారిని శంకరగిరిమాన్యాలు పట్టించారు. కానీ, వాంగ్ హుయినింగ్ను ప్రమోట్ చేసి తన బృందంలో చేర్చుకొన్నారు. జిన్పింగ్ విదేశీ పర్యటనల్లో వాంగ్ తప్పనిసరిగా ఉంటారు. 2017 నాటికి వాంగ్ చైనాలోని అత్యంత శక్తివంతమైన పోలిట్ బ్యూరో స్టాండిగ్ కమిటీలో సభ్యుడిగా ఎదిగాడు. చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిజంగా చెప్పే ‘షీజిన్పింగ్ థాట్స్’ పాలసీకు, ‘చైనీస్ డ్రీమ్’ స్లోగన్కు సృష్టి కర్త వాంగ్.
సాధారణంగా అధ్యక్షుడి వెన్నంటే ఉన్నా.. ఎక్కడా ప్రచారంలో ఉండకుండా జాగ్రత్తపడతాడు. జియాంగ్ జెమిన్ సమయం నుంచి అధ్యక్షులతో కలిసి ఉన్న వాంగ్ తొలిసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది 2017లో..! ఆ ఏడాది చైనా నిర్వహించిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్కు జిన్పింగ్ స్థానంలో హాజరై ప్రసంగించాడు.
పశ్చిమ దేశాల విమర్శకుడు..
ఇటీవల అమెరికా డెమొక్రసీ సదస్సుకు చైనాను ఆహ్వానించలేదు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఓ సందర్భంలో చైనాకు తనదైన శైలిలో ప్రజాస్వామ్యం ఉందని పేర్కొంది. చైనానే అతిపెద్ద ప్రజాస్వామ్యమని వెల్లడించింది. వాస్తవానికి ఈ ఆలోచనా విధానం వాంగ్ హుయినింగ్ మెదడు నుంచి వచ్చిందే. పశ్చిమ దేశాలు పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యాలని.. వాటి లక్ష్యాలు వేరే ఉంటాయని వాంగ్ నమ్ముతాడు. అందుకే ‘సోషలిజం విత్ చైనీస్ క్యారక్టరిస్టిక్స్’ అనే హైబ్రీడ్ విధానాన్ని రూపొందించాడు. ప్రస్తుత అధ్యక్షుడు షీజిన్పింగ్ దీనినే పాటిస్తున్నారు.
భారత ప్రజాస్వామ్యం పశ్చిమ దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని వాంగ్ ఓ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. 1989లో వాంగ్ రాసిన ‘అనాలసిస్ ఆఫ్ అడ్మిన్స్ట్రేటివ్ ఎకాలజీ’ పుస్తకంలో వివిధ దేశాల్లో పాలన విధానాలను విశ్లేషించాడు. అమెరికా, యూకే, జపాన్లో భద్రతకు తొలిప్రాధాన్యమిస్తే.. భారత్లో గౌరవానికి పెద్దపీట వేస్తారని పేర్కొన్నాడు.
జిన్పింగ్ అవినీతి వ్యతిరేక ఉద్యమంపై వాంగ్ ముద్ర..!
జిన్పింగ్ ప్రత్యర్థులను అణచివేయడానికి ఎంచుకొన్న బలమైన మార్గం అవినీతి నిర్మూలన ఉద్యమం. ఫలితంగా లక్షల సంఖ్యలో జిన్పింగ్ వ్యతిరేకులు జైళ్లలో మగ్గుతున్నారు. వాస్తవానికి వాంగ్ 1990ల్లో ‘యాంటి కరప్షన్: ఎక్సపర్మెంట్ ఇన్ చైనా’ అనే పుస్తకాన్ని రాశాడు. దీనిలో అవినీతికి కారణాలు, నిర్మూలనకు అవకాశాలు, గతంలో చైనా చేపట్టిన అవినీతి నిర్మూలన కార్యక్రమాలు వంటివి విశ్లేషించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే షీజిన్పింగ్ అధికారంలో ఉండేందుకు అవసరమైన వాదనలకు రూపుశిల్పి ఇతడే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..