Mulayam singh Yadav: ఐసీయూలోనే ములాయం.. ఆరోగ్యం విషమం

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Published : 08 Oct 2022 18:56 IST

గురుగ్రామ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది.‘‘ ములాయం సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. జీవనాధార ఔషధాలతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది’’ అని బులిటెన్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. కొన్ని ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 82 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని