ఉగ్రవాద నిధులకోసం భారత్లో డ్రగ్స్ దందా!
ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు....
ఎన్బీసీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు!
పాకిస్థాన్ కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు డ్రగ్స్ దందాకు తెరలేపారా? తమ అనుయాయుల ద్వారా కమీషన్ పద్ధతిలో ముంబయి సహా భారత్లోని పలు ప్రాంతాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారా? ఈ ముఠాలకు ‘డి’ కంపెనీతో సంబంధాలున్నాయా? డ్రగ్స్ సొత్తు హవాలా లేదా ఎన్జీఓల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పాకిస్థాన్ గుట్టు రట్టు చేసిన ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల డార్క్నైట్ ఆపరేషన్పై ప్రత్యేక కథనం.
ముంబయి: ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి ముంబయికి ఈ మాదకద్రవ్యాల సరఫరా దందా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ పెడ్లర్లు ద్విచక్రవాహనంపై వచ్చి మాదకద్రవ్యాలను బట్వాడా చేస్తున్నట్లు తేల్చారు. ముంబయిలో చాలా కాలంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు ‘డార్క్నైట్’ పేరుతో ఎన్సీబీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూకశ్మీర్ నుంచి ముంబయితోపాటు వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే రాకెట్ను పట్టుకున్నారు. ఈ ముఠాకు టెర్రర్ ఫండింగ్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అధికారులు కంగుతిన్నారు.
దావూద్ కంపెనీతో సంబంధాలు
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న ఈ డ్రగ్స్ రాకెట్తో అండర్వరల్డ్ డాన్ దావూద్ కంపెనీకి కూడా సంబంధాలున్నట్లు ఎన్సీబీ దర్యాప్తులో వెల్లడైంది. రూ.100 కోట్ల డ్రగ్స్ సిండికేట్ సూత్రధారులు పాకిస్థాన్లో తిష్టవేసి.. వారి అనుచరుల ద్వారా కమీషన్ పద్ధతిలో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఈ ముఠా సభ్యులు ‘డి’ కంపెనీతో ఉన్న సంబంధాలను వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ దందాతో వచ్చే డబ్బును హవాలా లేదా ఎన్జీఓల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు చేరవేస్తున్నారు. ఈ నెట్వర్క్తో సంబంధాలు కలిగిన పంజాబ్లోని ఇద్దరు డ్రగ్స్ డీలర్లను, ముంబయి, మహారాష్ట్రలో ఐదుగురు సప్లయర్లను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు.
ఉగ్ర కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్లో తిష్ట
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్లో తిష్టవేసిన కొందరు.. ఉగ్రవాదుల శిక్షణ కోసం నార్కో టెర్రరిజాన్ని ఊతంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు మాదకద్రవ్యాల్ని బట్వాడా చేసేందుకు జమ్మూ కశ్మీర్ నుంచి ముంబయికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు డార్క్నైట్ పేరుతో ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు పెడ్లర్ల కోసం దాదర్లోని ఓ ధార్మిక కేంద్రం వద్ద మాటువేశారు. ఈ నెల 15న పంజాబ్కు చెందిన రాజ్విందర్సింగ్, గుర్మీత్సింగ్లు డ్రగ్స్ కన్సైన్మెంట్తో దాదర్లోని ధార్మిక కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి లాంజ్లో అమిత్ ప్రకాశ్ పటేల్ అనే వ్యక్తిని కలిశారు. కాగా అక్కడే మాటువేసిన ఎన్సీబీ అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి 2 కిలోల మాదకద్రవ్యాలు, రూ.2.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా వారికి డ్రగ్స్ ఆర్డర్ వచ్చినట్లు.. దీంతో కశ్మీర్ వెళ్లి డ్రగ్స్ తీసుకొని ముంబయిలో బట్వాడా చేసేందుకు వచ్చినట్లు అరెస్టయిన వారిద్దరూ తెలిపారు.
మరిన్ని ప్రాంతాల్లో దాడులకు సిద్ధమైన అధికారులు
విచారణ సందర్భంగా మరో డ్రగ్స్ డీలర్ కమలేశ్ గుప్తా వివరాలు కూడా తెలిశాయి. కమలేశ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు అతడిచ్చిన సమాచారం మేరకు నూర్ మహమ్మద్ అనే మరో డ్రగ్స్ సప్లయర్ ఇంటిపై దాడి చేశారు. అక్కడి నుంచి 3 కిలోల మాదకద్రవ్యాలు, రూ. 2.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో టెర్రర్ ఫండింగ్, డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. డార్క్నైట్ ఆపరేషన్లో భాగంగా ఎన్సీబీ అధికారులు పంజాబ్, జమ్మూకశ్మీర్, ముంబయిలోని మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!