Beijing Olympics: బహిష్కరిస్తారా.. తగిన రీతిలో బదులిస్తాం: చైనా

వచ్చే ఏడాది బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ను అగ్రరాజ్యం అమెరికా, యూకే సహా పలు దేశాలు దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అథ్లెట్లను పంపుతాం గానీ.. తమ దేశాల తరఫున దౌత్యప్రతినిధులను పంపించేది లేదని స్పష్టం చేశాయి. కాగా.. ఆయా దేశాల బహిష్కరణతో తమకేం ఆందోళన లేదని

Updated : 10 Dec 2021 16:10 IST

బీజింగ్‌: వచ్చే ఏడాది బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ను అగ్రరాజ్యం అమెరికా, యూకే సహా పలు దేశాలు దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అథ్లెట్లను పంపుతాం గానీ.. తమ దేశాల తరఫున దౌత్యప్రతినిధులను పంపించేది లేదని స్పష్టం చేశాయి. కాగా.. ఆయా దేశాల బహిష్కరణతో తమకేం ఆందోళన లేదని చైనా వెల్లడించింది. ‘‘అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసినా మాకేం ఆందోళన లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్‌ ఒలింపిక్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. కొంతమంది దేశాధినేతలు, రాజకుటుంబీకులు ఒలింపిక్స్‌ వేడుకలకు హాజరుకానున్నారు’’అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు.

ఒలింపిక్స్‌ను అమెరికా.. దాని మిత్ర దేశాలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని వాంగ్‌ విమర్శించారు. చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దౌత్యపరమైన బహిష్కరణ చేసినందుకు గానూ అమెరికాకు తగిన రీతిలో బదులిస్తామని చైనా వెల్లడించింది. బ్రిటన్‌, కెనడా ప్రతినిధుల్ని తాము ఆహ్వానించట్లేదని.. వారి ప్రభావం ఒలింపిక్స్‌ నిర్వహణపై ఏ మాత్రం ఉండదని పేర్కొంది. శీతాకాల ఒలింపిక్స్‌ బీజింగ్‌ వేదికగా ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమై 20వ తేదీన ముగియనున్నాయి.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని