Punjab CM: రిపబ్లిక్‌ డే రోజు దాడి చేస్తాం.. పంజాబ్‌ సీఎంకు బెదిరింపు

నిషేధిత ‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. 

Updated : 16 Jan 2024 12:57 IST

చండీగఢ్‌: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి హద్దు మీరాడు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్(Bhagwant Mann), డీజీపీ గౌరవ్ యాదవ్‌లను హత్య చేస్తానని బెదిరించాడు.(Death threats). గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్లు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చాడు. గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.

భారత్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ ఇటీవల తరచూ పన్నూ బెదిరింపులకు దిగుతున్నాడు. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న కేంద్రం.. ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. కాగా, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) వేర్పాటువాద సంస్థను భారత్‌ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా దాని వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని