Pegasus: దేశం, వ్యవస్థ కంటే మోదీ ఎక్కువ కాదు.. సుప్రీం తీర్పుపై రాహుల్
పెగాసస్ స్పైవేర్తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వాగతించారు.
దిల్లీ: పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware)తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. పెగాసస్పై కమిటీ ఏర్పాటుతో గొప్ప అడుగు పడిందని, దీంతో నిజానిజాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. దేశం, వ్యవస్థల కంటే ప్రధాని ఎక్కువ కాదన్నారు.
‘‘పెగాసస్తో దేశ పౌరులపై నిఘా పెట్టి.. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. దీనిపై పార్లమెంట్లో మేం ప్రశ్నిస్తే ప్రభుత్వం (Central Govt.) నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరికదా.. మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులు.. మా వాదనను సమర్థించాయి. పెగాసస్పై కమిటీ ఏర్పాటుతో గొప్ప ముందడుగు పడింది. దీంతో నిజాలు బయటకు వస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో లేవనెత్తుతాం. ప్రధాని మూడు ప్రశ్నలు సంధిస్తున్నాం.. పెగాసస్ను ఉపయోగించేందుకు ఎవరు అధికారమిచ్చారు? ఈ స్పైవేర్ను ఎవరు ప్రయోగించారు? మన దేశ పౌరుల సమాచారం ఏ దేశం వద్దకైనా చేరిందా?’’ అని రాహుల్ మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని, భాజపా మంత్రులకు వ్యతిరేకంగా పెగాసస్ను ఉపయోగించారని రాహుల్ ఆరోపించారు. ‘‘పెగాసస్తో వీరి సమాచారం ప్రధాని మోదీ, హోంమంత్రికి చేరిందా? ఒకవేళ ఎన్నికల కమిషన్, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ప్రధానికి అందిస్తే.. అది పూర్తిగా నేరపూరిత చర్యే. దానిపై చర్యలు తీసుకోవాలి. దేశం, వ్యవస్థ కంటే ప్రధాని ఏం ఎక్కువ కాదు’’ అని రాహుల్ అన్నారు.
పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తితో స్వత్రంత కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్పై వచ్చిన ఆరోపణలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించింది. సాంకేతికత ఎంత ముఖ్యమో.. దేశ పౌరుల గోప్యత హక్కును కాపాడటం కూడా అంతే ముఖ్యమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్