తపోవన్లో నిలిచిపోయిన సహాయక చర్యలు
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రిషిగంగ ఉప్పొంగింది. ఈ నది నీటి మట్టం పెరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారి కోసం.....
తపోవన్: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రిషి గంగ నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారి కోసం నాలుగు రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి ఎస్ బదౌరియా వెల్లడించారు. సొరంగం లోపల పనిలో ఉన్న భద్రతా సిబ్బందితో పాటు అక్కడ డ్రిల్లింగ్ చేసేందుకు ఉంచిన భారీ యంత్రాలను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తపోవన్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ టన్నెల్లో చిక్కుకున్న 25 నుంచి 35మంది కోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలన్న లక్ష్యంతో పూడుకుపోయిన మట్టికే రంధ్రాలు చేసి ప్రాణవాయువు పంపించాలని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, నీటిమట్టం పెరగడంతో చమోలి ఎస్పీ యశ్వంత్ సింగ్ చౌహాన్ నదీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆదివారం రోజున ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైనవారిలో 34 మంది మృతదేహాలు దొరికాయి. అందులో 29 మందిని గుర్తించారు. వీరిలో పోలీసు హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకున్నారు. దాంతో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య 172గా ఉంది. సమయం గడిచేకొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆశలు సన్నగిల్లుతుండడంతో మరింత ఆందోళన నెలకొంది. మరోవైపు, 1500 మీటర్ల పొడవు గల సొరంగంలో ఇంతవరకు 120 మీటర్ల మేర పూడికను తీయగలిగారు. అయినా ఇంకా నీరు, బురద కొట్టుకొని వస్తుండడంతో సహాయ చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని చోట్ల మట్టి గట్టిపడడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళానికి చెందిన 450 మందితో పాటు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైనికులు మొత్తం 600కుపైగా జవాన్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి జాడ కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలు, రిమోట్ సెన్సింగ్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి..
ఉత్తరాఖండ్లో జలప్రళయ.. ఫొటో గ్యాలరీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు