Taiwan: తైవాన్ ఆక్రమణ దిశగా చైనా అడుగులు..?
దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలను పంపించి కవ్వించింది. ఇటీవల కాలంలో ఒక దేశ గగనతలంలోకి మరో దేశం విమానాలు ఈ స్థాయిలో వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది.
దక్షిణ చైనా సముద్రంలో వేగంగా మారుతున్న పరిణామాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలను పంపించి కవ్వించింది. ఇటీవల కాలంలో ఒక దేశ గగనతలంలోకి మరో దేశం విమానాలు ఈ స్థాయిలో వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి పెరిగింది. తైవాన్ ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2025లోపు చైనా తమ దేశంపై దండయాత్ర చేయడం ఖాయమని రక్షణ మంత్రి ఛై-కూఛెంగ్ ఏకంగా పార్లమెంట్లోనే పేర్కొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఏమి జరుగుతోంది..?
ఇటీవల కాలంలో చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్ గగనతలంలో ప్రవేశిస్తున్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. సోమవారం ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది. తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఒక్కసారి ఎన్ని విమానాలను గుర్తించగలదో అంచనా వేయడానికి డ్రాగన్ తరచూ ఇలా చేస్తోంది. అందుకే క్రమంగా విమానాల సంఖ్యను కూడా పెంచుతోంది.
భారత్తో సెమీకండక్టర్ల తయారీ ఒప్పంద చర్చల సమయంలో..
భారత్లో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడంపై తైవాన్తో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత్లో టీఎస్ఎంసీ(తైవాన్ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ కార్పొరేషన్) రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది భారత్లోని పరిశ్రమలను మరోమెట్టు పైకి ఎక్కించే ఒప్పందం. చైనాకు ఈ ఒప్పందం ఏమాత్రం ఇష్టంలేదు. ఇటీవల చైనా చొరబాట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం.
తేలని బైడెన్ పాలసీ..
ట్రంప్ హయాంలో తైవాన్ను రక్షించేందుకు అమెరికా దూకుడుగానే వ్యవహరించింది. తైవాన్ జోలికి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక దశలో హెచ్చరించింది. కానీ, బైడెన్ వచ్చాక అమెరికా దూకుడు తగ్గింది. తాజాగా కొందరు విలేకర్లు చైనా యుద్ధవిమానాల చొరబాట్లపై బైడెన్ను ప్రశ్నించగా..‘‘నేను షీ జిన్పింగ్తో మాట్లాడాను. మేము తైవాన్ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు అంగీకారానికి వచ్చాము. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా ముందుకు వెళుతుందని నేను అనుకోవట్లేదు’’ అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఆయన షీ జిన్పింగ్తో మాట్లాడిన విషయం తెలిసిందే. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర డ్రాగన్కు లేదనే విషయం బైడెన్కు తెలియనిది కాదు. భారత్తో సత్సంబంధాలు కొనసాగుతుండగానే చైనా దాడి చేసిందని చరిత్ర చూస్తే అర్థమవుతుంది.
అమెరికా రక్షించగలదా..?
వాస్తవానికి ‘ఫస్ట్ ఐలాండ్ ఛైన్’గా వ్యవహరించే ప్రదేశంలో తైవాన్ ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న జపాన్, ఫిలిప్పీన్స్, వియాత్నాం దేశాలకు అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తైవాన్లోని సెమీకండక్టర్ పరిశ్రమపై ఈ దేశాలు భారీగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అమెరికా దళాలు కూడా ఉంటున్నాయి. తైవాన్ ఆయుధాల్లో అత్యధికం అమెరికావే. గతేడాది తైవాన్ 62 బిలియన్ డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి కొనేందుకు సిద్ధమైంది. దీనికి అప్పట్లో ట్రంప్ పచ్చజెండా ఊపారు. తైవాన్కు ఆయుధాలు అమ్మడం అంటే... చైనాకు నిద్రను కరవు చేయడం వంటిదే. ఈ డీల్లో భాగంగా 66 అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు తైవాన్కు అందనున్నాయి. ఇప్పటికే 2019లో 90 విమానాలను ఆర్డరు చేసింది. ఏడాది క్రితం మరో 66 విమానాలకు పచ్చజెండా ఊపింది. తైవాన్ ఆక్రమణ జరిగితే అమెరికా టెక్నాలజీతో చేసిన ఆయుధాలు చైనా చేతిలో పడతాయి. ఈ విషయం అమెరికా నేతలకు తెలుసు. అంతేకాదు అమెరికాను వెనక్కి నెట్టి చైనా సూపర్ పవర్గా పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చుకొంటుంది. ఈ నేపథ్యంలో చైనా దూకుడును అగ్రరాజ్యం కట్టడి చేస్తుందన్న ఆశ తైవాన్లో ఉంది. క్రిమియా ఆక్రమణకు రష్యా ఆర్థికంగా భారీగా మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఇటీవల ఆ దేశ జీడీపీ కూడా కుచించుకుపోతోంది. డ్రాగన్ తైవాన్పై దండెత్తితే ఇటువంటి పరిస్థితే చైనాకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా ‘తైవాన్ ఇన్వేజన్ ప్రివెన్షన్ యాక్ట్’ను తీసుకొచ్చింది.
చుట్టుపక్కల దేశాలతో ఉద్రిక్తతలు అందుకేనా..
గత కొన్నేళ్లుగా తైవాన్తోపాటు చుట్టుపక్కల దేశాలతో కూడా డ్రాగన్ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. తైవాన్పై దాడి అంశాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలా చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రపంచం దృష్టిని వేరే ప్రాంతాలకు మళ్లించి.. తైవాన్పై హఠాత్తుగా దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఇరాక్తో యుద్ధం సమయంలో అమెరికా ఇటువంటి వ్యూహాన్నే అమలు చేసింది. తొలుత కువైట్ను ఆక్రమించిన ఇరాక్ సేనలపై నేరుగా దాడి చేస్తుందనే భ్రమను కల్పించింది. ఇందుకోసం చిన్నాచితకా దాడులు కూడా చేసింది. కానీ, తర్వాత మరో వైపు నుంచి నేరుగా ఇరాక్లోకి అమెరికా సేనలు అడుగుపెట్టాయి. కువైట్లోని ఇరాక్ సేనలకు సరఫరాలు నిలిచిపోయాయి. చైనా కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించవచ్చు.
చైనా సమీపంలోని ఓకినావా(జపాన్), గువామ్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర అమెరికా మిత్ర దేశాలతో గొడవ పెట్టుకొంటే.. వారి దృష్టి మళ్లించి తైవాన్ను ఆక్రమించవచ్చు. తైవాన్ను ఆక్రమించేందుకు చేస్తున్న యత్నాలు అమెరికా జనరల్స్కు తెలియనిది కాదు. ఇటీవల అమెరికా జనరల్ మార్క్మిల్లీ కాంగ్రెస్ విచారణలో మాట్లాడుతూ ‘‘2027 నాటికి తైవాన్ను ఆక్రమించి ఆధీనంలో ఉంచుకొనే సామర్థ్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది.. అయితే, సమీప భవిష్యత్తులో ఇలా చేయకపోవచ్చు. గతంలో 2035 నాటికి తైవాన్ ఆక్రమించాలన్న లక్ష్యాన్ని షీ జిన్పింగ్ 2027కు కుదించారు’’ అని వెల్లడించారు. తాజాగా తైవాన్ రక్షణ మంత్రి పార్లమెంట్లో ఇటువంటి అనుమానాన్నే వ్యక్తం చేయడం దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిని తెలియజేస్తోంది. దీంతో 8.6 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆయుధాలు సమీకరించే విషయాన్ని తైవాన్ పరిశీలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!