Haibatullah Akhundzada: తొలిసారి బయటకు వచ్చిన తాలిబన్ అధినేత!
తమ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా తొలిసారి ప్రజల ముందుకు వచ్చారని తాలిబన్లు ఆదివారం ప్రకటించారు...
ప్రకటించిన తాలిబన్ వర్గాలు
కాబుల్: అఫ్గానిస్థాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త సర్కార్కు ప్రధాని హోదాలో తాలిబన్ల సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నారు. కానీ, అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ఆయన ఎక్కడా బయటకు కనిపించకపోవడం అనేక అనుమానాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో ఆదివారం తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. తమ నేత అఖుండ్ జాదా ప్రజల మధ్యకు వచ్చారని వెల్లడించారు.
తాలిబన్ల మద్దతుదారులను ఉద్దేశించి అఖుండ్ జాదా ప్రసంగించారని తాలిబన్ వర్గాలు ఆదివారం ప్రకటించాయి. కాందహార్లోని దారుల్ ఉలుం హకిమా మదర్సాలో ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన అక్కడకు చేరుకున్నారని తెలిపారు. అయితే, అందుకు సంబంధించిన చిత్రాలుగానీ, వీడియోలుగానీ విడుదల చేయలేదు. కానీ, ఆ ప్రసంగంలోని 10 నిమిషాల నిడివి గల కొంత భాగాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, ఆయన మాటల్లో ఎక్కడా రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు లేవని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేవలం తాలిబన్ల నాయకత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని మాత్రమే అన్నట్లు తెలుస్తోంది. సవాళ్లు ఎదుర్కొంటున్న అఫ్గాన్కు విజయం వరించాలని ప్రార్థించినట్లు సమాచారం.
అధికారంలోకి వచ్చినా తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదా అజ్ఞాతం నుంచి ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఇంతకుముందు కూడా ఆ నేత ఎన్నడూ ఎవరికీ కనిపించేవాడు కాదు. తాలిబన్లు ఆ మధ్య ఆయన ఛాయాచిత్రం విడుదల చేసేవరకు అతని రూపురేఖలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. అఖుండ్ జాదా మొదటి నుంచీ కాందహార్లోనే ఉంటున్నాడనీ, త్వరలోనే ప్రజల్లోకి వస్తాడని తాలిబన్ ప్రతినిధి ఒకరు గతంలో వెల్లడించారు. అఖుండ్ మొదటినుంచీ మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమవుతూ అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. తాలిబన్ సంస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ అకాల మరణం చెందిన విషయం 2015లో బయటకు వచ్చింది. ఆ స్థానాన్ని ముల్లా మన్సూర్ అఖ్తర్ భర్తీ చేశాడు. 2016లో అఖ్తర్ను డ్రోన్ దాడి ద్వారా అమెరికా అంతమొందించాక, నాయకత్వం కోసం తాలిబన్ వర్గాల మధ్య కుమ్ములాట చోటు చేసుకుంది. సమైక్యంగా నడపగల నాయకుడి కోసం మొదలైన అన్వేషణ అఖుండ్ జాదా ఎంపికతో ముగిసింది. అంతవరకు అమెరికా బారి నుంచి తప్పించుకోవడానికి ఆ నాయకుడు రహస్య జీవితం గడిపేవాడు. మతపరమైన సందేశాలు వెలువరించడం మినహా జనంలోకి వచ్చిందే లేదు.
దీంతో జాదాకు కరోనా సోకిందనీ, ఆరోగ్యం బాగాలేదనీ గతంలో వదంతులు వ్యాపించాయి. కొందరైతే బాంబు పేలుడులో ఆ నాయకుడు మరణించినట్లు ప్రచారం చేశారు. అయితే, అవేవీ నిజం కావని తేలిపోయింది. అధికారం చేజిక్కిన తర్వాత అఫ్గాన్లో వివిధ తెగలు, వర్గాలు ఘర్షణకు దిగే ప్రమాదం ఉందని.. వీరందరినీ సమన్వయపరచడానికి అఖుండ్ జాదా జనం ముందుకు రాక తప్పకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్