ప్లాస్టిక్కు చెక్ పెడుతూ స్టాలిన్ మరో నిర్ణయం
అనేక వినూత్న నిర్ణయాలతో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి బాటలో నడుస్తూ అనేక విప్లవాత్మక, వినూత్న నిర్ణయాలతో ముందుకెళుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్...
చెన్నై: అనేక వినూత్న నిర్ణయాలతో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి బాటలో నడుస్తూ అనేక విప్లవాత్మక, వినూత్న నిర్ణయాలతో ముందుకెళుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరో పాత సంస్కృతికి ఊపిరులూదారు. ముఖ్యంగా తన తండ్రి గతంలో చేపట్టినవి, చేపట్టాలని కలలు కన్న అంశాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ క్రమంలో గత స్మృతుల్లోకి తీసుకెళుతూ రాష్ట్రంలో తిరిగి పసుపు సంచుల వాడకాన్ని ప్రోత్సహించేలా మీండుం మంజప్పై (తిరిగి పసుపు సంచులు) ప్రచారాన్ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. పర్యావరణం, సహజ వనరులకు కోలుకోలేని నష్టాన్ని కల్గించే హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడటమే ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ పసుపు సంచులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ..పర్యావరణానికి కలిగించే హానికారకాలు మానవాళిని మళ్లీ పాతాళంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నం ఇకపై పసుపు సంచిగా అభివర్ణించారు. పసుపు సంచులు పర్యావరణానికి సరైనవని, అందమైన ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి హానికల్గిస్తాయని స్టాలిన్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు పసుపు సంచులు అందించారు.
పర్యావరణాన్ని కాపాడటంలోనూ ముందుండాలి
ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం ద్వారా కలిగే నష్టాలను స్టాలిన్ ప్రస్తావించారు. అన్ని రంగాల్లో మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తున్న తమిళనాడు పర్యావరణాన్ని కాపాడటంలోనూ ముందుండాలన్నారు. ప్రకృతిని కాపాడాలని ప్రకృతితో కలసి పయనించాలని పర్యావరణానికి విఘాతం కల్గించే ప్లాస్టిక్కు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. పసుపుసంచి తీసుకెళ్లడం ఎవరూ అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదని, పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నమే పసుపుసంచి అని పేర్కొన్నారు.ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ను అంతం చేసేందుకు ప్రజావిప్లవం రావాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది.ఈనేపథ్యంలో పసుపుసంచి ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు మీండుం మంజప్పైని సీఎం ప్రారంభించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం