Omicron: ఒమిక్రాన్ను అడ్డుకునే యాంటీబాడీలు.., మూడో డోస్తో ప్రయోజనం!
ఒమిక్రాన్తోపాటు ఇతర కరోనావైరస్ వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజా అధ్యయనంలో మెరుగైన ఫలితాలు
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 మహమ్మారి రోజురోజుకు రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూనే ఉంది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, చికిత్సా విధానాల పనితీరుకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్తోపాటు ఇతర కరోనావైరస్ వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఒమిక్రాన్నే కాకుండా భవిష్యత్తులో వెలుగుచూసే వివిధ వేరియంట్లను ఎదుర్కొనే వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సల రూపకల్పనలో ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాజా అధ్యయనం జర్నల్ నేచర్లో ప్రచురితమైంది.
వైరస్ మ్యుటేషన్ చెందినప్పటికీ మార్పులకు గురికాని స్పైక్ ప్రొటీన్లోని ప్రధాన భాగాలను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా వైరస్ నిరంతర పరిణామక్రమాన్ని అధిగమించేందుకు మార్గం దొరికినట్లేనని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన డాక్టర్ డేవిడ్ వీస్లెర్ పేర్కొన్నారు. వీటివల్ల కేవలం ఒక్క ఒమిక్రాన్నే కాకుండా ఇతర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సల రూపకల్పనకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అధిక మ్యుటేషన్లు..
అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తోన్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ప్రొటీన్లో దాదాపు 37 మ్యుటేషన్లు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మానవ కణాలను తేలికగా బంధించి వాటిలోకి చొచ్చుకుపోతూ ఇన్ఫెక్షన్కు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. ఇలా భారీ స్థాయిలో మ్యుటేషన్లకు గురికావడం వల్లే వ్యాక్సిన్ తీసుకున్న వారితో పాటు ఇదివరకు వైరస్ సోకిన వారు కూడా రీ-ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఒమిక్రాన్ వేరియంట్లోని స్పైక్ప్రొటీన్ మానవ కణాలకు ఎలా అంటుకున్నాయో తెలుసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని డేవిడ్ వీస్లెర్ పేర్కొన్నారు.
మ్యుటేషన్ల ప్రభావాన్ని అంచనా వేయడంపై పరిశోధనలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్ మాదిరిగా స్పైక్ప్రొటీన్ను ఉత్పత్తి చేసేందుకు పునరుత్పత్తి కాలేని ‘సుడో వైరస్’ను తయారు చేశారు. వీటితోపాటు ఒమిక్రాన్ మ్యుటేషన్ల స్పైక్ ప్రొటీన్లతోపాటు అంతకుముందు వెలుగుచూసిన ఇతర వేరియంట్ల స్పైక్ ప్రొటీన్లనూ సృష్టించారు. వీటిపై ప్రయోగాలు జరిపిన పరిశోధకులు.. మానవ కణాలను ఈ స్పైక్ ప్రొటీన్లు ఏవిధంగా బంధిస్తున్నాయో పరిశీలించారు. వైరస్ తొలినాళ్లనాటి స్పైక్ ప్రొటీన్తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రొటీన్ 2.4రెట్లు అధికంగా కణాలకు అంటుకొని ఉంటున్నట్లు కనుగొన్నారు.
మూడో డోసు ప్రయోజనమే..
అనంతరం వీటిపై గతంలో ఇతర రకాల వైరస్లు సోకిన బాధితులు, వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సేకరించిన యాంటీబాడీలు ఏవిధంగా నిరోధిస్తున్నాయో పరిశీలించారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారితోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ను నిరోధిస్తున్నట్లు గుర్తించారు. మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) రెండు డోసుల్లో తీసుకున్న వారిలోనూ పలు వేరియంట్లను తటస్థీకరిస్తున్నట్లు కనుగొన్నారు. ఇలా ఒమిక్రాన్ను ఎదుర్కోవడంలో థర్డ్డోసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. వీటితోపాటు యాంటీబాడీ చికిత్సలపై పరిశోధనలు చేశారు. ఇతర వేరియంట్లను తటస్థీకరించడంలో యాంటీబాడీలు కూడా సమర్థంగానే పనిచేస్తున్నట్లు గుర్తించిన పరిశోధకులు.. భిన్న రకాల వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సలను రూపొందించడంలో తాజా పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్