Omicron: ఒమిక్రాన్‌తో భయం.. కొవిడ్‌ ఆంక్షల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొవిడ్‌ మహమ్మారి భయాలు.. మళ్లీ ఒమిక్రాన్‌ రూపంలో గుబులు రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసి పలు ప్రపంచ దేశాలకు వ్యాప్తిచెందుతున్న......

Published : 30 Nov 2021 16:16 IST

దిల్లీ: గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొవిడ్‌ మహమ్మారి భయాలు.. మళ్లీ ఒమిక్రాన్‌ రూపంలో గుబులు రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసి పలు ప్రపంచ దేశాలకు వ్యాప్తిచెందుతున్న ఈ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాల్ని డిసెంబర్‌ 31వరకు పొడిగించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యంత అప్రమత్తతో ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు. 

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా స్క్రీనింగ్‌, టెస్టింగ్‌ చేయాలని సూచించారు. అలాగే, వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్‌ చేసి, వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. మరోవైపు, కొత్త వేరియంట్ల కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ తక్షణమే ప్రజారోగ్య చర్యల్ని తక్షణమే చేపట్టాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్‌ కట్టడి చర్యల్ని డిసెంబర్‌ 31వరకు కొనసాగించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించారు. ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు పెంచాలని సూచించారు. 

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని