Corona: భారత్లో 30-47లక్షల కరోనా మరణాలు!
భారత్పై రెండు దశల్లో విరుచుకుపడిన కరోనా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4
అధికారిక లెక్కల కంటే 10రెట్లు ఎక్కువేనట..
దిల్లీ: భారత్పై రెండు దశల్లో విరుచుకుపడిన కరోనా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4.14లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అయితే వాస్తవంగా దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాజాగా వెలువడుతున్న అధ్యయనాలు ఆందోళనకర విషయాలను బయటపెడుతున్నాయి. భారత్లో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే 10రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం తాజాగా వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 30-47లక్షల మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది.
భారత్లో కొవిడ్ పరిస్థితులు, మరణాలపై అమెరికాలోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేశారు. ఇందులో ఒకరు భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కావడం గమనార్హం. భారత్లో చాలా ప్రాంతాల్లో మృతుల సంఖ్యపై గణన నిర్దుష్టంగా జరగలేదని, అందువల్ల వాస్తవ మరణాలు అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువ ఉండొచ్చని వీరు తమ నివేదికలో పేర్కొన్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు దేశంలో 30 నుంచి 47లక్షల మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. ప్రభుత్వ లెక్కల కంటే ఇది 10రెట్లు ఎక్కువని వెల్లడించారు. ‘‘వాస్తవ మరణాల సంఖ్య వందలు, వేలు, లక్షలు కాదు మిలియన్లలో ఉండొచ్చు. స్వాతంత్ర్యం తర్వాత భారత్లో నెలకొన్న అత్యంత ఘోరమైన మావన విషాదం ఇదే అయి ఉంటుంది’’ అని నివేదిక వెల్లడించింది.
ఏడు రాష్ట్రాల్లో జనన, మరణాలు రికార్డు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్), రక్తపరీక్షలు, ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించారు. దేశంలో చోటుచేసుకున్న మరణాలకు సంబంధించిన అన్ని కారణాలను అధ్యయనం చేసి, వాటిని అంతక్రితం(కరోనా విజృంభణకు ముందు) ఏడాది మరణాలతో పోల్చిన అనంతరం ఈ అంచనాలు వెలువరించినట్లు నివేదిక తెలిపింది.
ఇకపోతే.. భారత్లో మృతుల గణన సజావుగా లేదు. మహమ్మారికి ముందు కూడా చాలావరకు సాధారణ మరణాలు కూడా రికార్డుల్లో ఉండవు. గత కొద్ది నెలలుగా అనేక రాష్ట్రాలు కూడా కరోనా మరణాలు లెక్కలను సవరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో నమోదు కాని మరణాలు గుర్తించి ఇప్పుడు బయటపెడుతున్నాయి. వీటిని బట్టి చూస్తుంటే పెద్ద ఎత్తునే మరణాలు అధికారికంగా రికార్డు కావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు భారత్లో కరోనా మరణాల రేటు(10లక్షల మంది జనాభాకు చొప్పున లెక్కించే రేటు).. ప్రపంచ సగటు మరణాల రేటు కంటే చాలా తక్కువగా ఉంది. ఇది కూడా అనుమానాలకు తావిస్తోందని నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కేంద్రం మాత్రం ఈ అధ్యయనాలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే వస్తోంది. కొవిడ్ డేటా మేనేజ్మెంట్లో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోందని.. కరోనా మరణాల నమోదు ప్రక్రియకు కచ్చితమైన విధానాన్ని పాటిస్తున్నామని పునరుద్ఘాటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన మూడో దేశం భారత్. అత్యధికంగా అమెరికాలో 6లక్షలు, బ్రెజిల్లో 5.42లక్షల మంది కొవిడ్కు బలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM