Free Ration: అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ శక్తుల వల్లే..!
స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయింపులు, పలు పథకాలు పెరిగినప్పటికీ అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ వ్యక్తుల వల్లే పేదలకు ఆశించినంతగా లబ్ధి చేకూరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన’ అవగాహన కార్యక్రమంలో ప్రధాని మోదీ
దిల్లీ: స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయింపులు, పలు పథకాలు పెరిగినప్పటికీ అసమర్థ పంపిణీ వ్యవస్థ, స్వార్థ వ్యక్తుల వల్లే పేదలకు ఆశించినంతగా లబ్ధి చేకూరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలి కడుపుతో నిద్రించకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని.. అందుకే కరోనా సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరికీ ఉచితంగా రేషన్ అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PM-GKAY)’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని పునరుద్ఘాటించారు. PM-GKAY అవగాహన కార్యక్రమాన్ని గుజరాత్లో ప్రారంభించిన ఆయన.. కొవిడ్ సంక్షోభ సమయంలో లక్షల మంది నిరుపేదల బాధలను తగ్గించడంలో ఆహార భద్రతా పథకం దోహదపడిందన్నారు.
‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పేదలకు చౌక ధరలో ఆహార పదార్థాలను అందిస్తాయని చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది ఏడాదికి బడ్జెట్లోనూ కేటాయింపులు పెరిగాయి. కానీ, వాటి ప్రభావం మాత్రం తక్కువగానే కనిపించింది. ముఖ్యంగా ఆహార నిల్వలు పెరిగినప్పటికీ ఆకలి, పోషకాహార లోపం మాత్రం ఆ నిష్పత్తిలో తగ్గలేదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకు వ్యవస్థలో చొరబడ్డ కొన్ని స్వార్థ శక్తులే కారణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు.. నూతన సాంకేతికతతో 2014 నుంచి కొత్త మార్గాన్ని అనుసరించామని ప్రధాని మోదీ తెలిపారు. వీటి సహాయంతో కోట్ల సంఖ్యలో నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు రేషన్ కార్డులను ఆధార్కు అనుసంధానం చేశామని చెప్పారు. తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తేవడంతో పాటు నూతన సాంకేతికతను ప్రోత్సహించేందుకు కృషి చేశామన్నారు.
ఇక మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో పేదల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచే లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందకు సాగుతున్నామని చెప్పారు. మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ పౌరులకు అన్నివిధాలా సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM