Lakhimpur Kheri: లఖింపుర్లో సంస్మరణ సభ.. అన్నదాతలకు నివాళి
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటనలో మృతిచెందిన అన్నదాతలకు నివాళులు అర్పించేందుకు రైతు సంఘాలు నేడు సంస్మరణ సభ నిర్వహించాయి.
పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటనలో మృతిచెందిన అన్నదాతలకు నివాళులు అర్పించేందుకు రైతు సంఘాలు నేడు సంస్మరణ సభ నిర్వహించాయి. ఇందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు. చనిపోయిన అన్నదాతలకు నివాళులు అర్పించారు. అయితే, రైతులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ వేదికపై కేవలం అన్నదాతలు మాత్రమే ఉంటారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు.
ఇక లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా షహీద్ కిసాన్ దివస్ నిర్వహిస్తున్నారు. ఆ ఘటనలో మృతి చెందిన నలుగురు రైతులతో పాటు ఓ జర్నలిస్టుకు స్మృతిగా ఈ రాత్రి 8 గంటలకు ప్రతి ఇంటి ముందు 5 కొవ్వొత్తులు వెలిగించాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రజలకు పిలుపు నిచ్చింది.
లఖీంపుర్ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఆయనను దాదాపు 12గంటల పాటు విచారించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో మరోసారి విచారించేందుకు పోలీసులు అనుమతి కోరగా.. అక్టోబర్ 15వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం ఆశిష్ మిశ్రా పోలీసు కస్టడీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్