Vaccine Protection: వ్యాక్సిన్ రక్షణ ఎంతకాలానికి క్షీణిస్తోంది..?
వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం
లండన్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వైరస్ నుంచి ఇవి ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐదు నుంచి ఆరు నెలల్లోనే ఫైజర్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ల నుంచి పొందే రక్షణ తగ్గుముఖం పడుతున్నట్లు తేలింది. వచ్చే నెల నుంచి బూస్టర్ డోసు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోన్న సమయంలో తాజా అధ్యయనం అందుకు మరింత బలం చేకూరుస్తోంది.
రక్షణ తగ్గినా.. ప్రయోజనమే ఎక్కువ..
కరోనా వైరస్ లక్షణాలు, వ్యాక్సిన్ల పనితీరును తెలుసుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన ZOE కొవిడ్ యాప్ డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్లు తీసుకున్న 12లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. ఫైజర్-బయోఎన్టెక్ రూపొందించిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తొలి నెలలో 88శాతం రక్షణ కల్పించగా.. ఐదు నుంచి ఆరు నెలల తర్వాత అది 74శాతానికి తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇక ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ నాలుగు నుంచి ఐదు నెలల్లోనే 77శాతం నుంచి 67శాతానికి పడిపోయినట్లు కనుగొన్నారు. ఇలా వయసు పైబడినవారితో పాటు ఆరోగ్యసంరక్షణ సిబ్బందికి శీతాకాలం నాటికి ఈ వ్యాక్సిన్ల నుంచి కలిగే రక్షణ 50శాతానికి తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ వెల్లడించారు.
84వేల మరణాల నిర్మూలన..
వ్యాక్సిన్ల నుంచి రక్షణ క్షీణిస్తోందని అంచనా వేయడమంటే.. వ్యాక్సిన్లను తీసుకోవద్దని కాదని డాక్టర్ టిమ్ స్పెక్టర్ అభిప్రాయపడ్డారు. టీకా తీసుకున్న కొన్ని నెలల తర్వాత వాటినుంచి రక్షణ తగ్గుతున్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి అవి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా డెల్టా వంటి వేరియంట్ల నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు అత్యంత రక్షణ ఇస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బూస్టర్ వ్యాక్సిన్ల కోసం వ్యూహాలు, ప్రణాళికలు రచించుకోవాల్సిన ఆవశ్యకత పెరిగిందని టిమ్ స్పెక్టర్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్లు విస్తృతంగా పంపిణీ చేయడం వల్ల ఇంగ్లాండ్లో దాదాపు 2.3కోట్ల ఇన్ఫెక్షన్లను, 84,600 కొవిడ్ మరణాలను నిర్మూలించగలిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (PHE) వెల్లడించింది.
ఇక తక్కువ రోగనిరోధకత శక్తి కలిగిన వారికి మూడో డోసు వల్ల కలిగే ప్రయోజనాలను అంచనా వేసేందుకు OCTAVE DUO అధ్యయనాన్ని బ్రిటన్ చేపడుతోందని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ను నిరోధించడంలో వ్యాక్సిన్లు బలమైన రక్షణ గోడను నిర్మిస్తున్నాయని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు. అంతేకాకుండా వైరస్తో కలిసి సురక్షితంగా జీవించడాన్ని ఇవి అనుమతిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!