J&K: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆసుపత్రిలోకి చొరబడి కాల్పులు

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆసుపత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి

Published : 05 Nov 2021 19:13 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆసుపత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ మధ్యాహ్నం శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలోని ఎస్‌కేఐఎంఎస్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోకి కొందరు ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడి కాల్పులకు తెగబడ్డారు. సమాచారమందుకున్న భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకుని ఆసుపత్రిని చుట్టుముట్టాయి. దీంతో ముష్కరులు పౌరులను అడ్డుపెట్టుకుని ఆసుపత్రి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలోనే నక్కినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ముష్కరుల కోసం వేట ప్రారంభించారు. 

కాగా.. జమ్మూకశ్మీర్‌లో పౌరులపై వరుస డాడుల తర్వాత ఉగ్రవాదులు చేపట్టిన భారీ దాడి ఇదేనని భద్రతాసిబ్బంది తెలిపారు. గత నెల కశ్మీర్‌ లోయలో వలస కూలీలు, మైనార్టీలను ముష్కరులను అతిదారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ దాడులను అరికట్టేందుకు శ్రీనగర్‌లో అదనంగా మరో 50 కంపెనీల భద్రతాబలగాలను మోహరించారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి భద్రతను సమీక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని