Chandrayaan-3: కర్తవ్యం పరిసమాప్తం!.. నిద్రాణంలోకి ల్యాండర్..!
రెండు వారాలపాటు చంద్రుడి దక్షిణ ధ్రువంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించిన ల్యాండర్, రోవర్లు (Chandrayaan 3).. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోకి మొన్నటివరకు ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ (Lunar Mission) భాగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) పంపించిన చంద్రయాన్-3 విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్, రోవర్లు.. రెండు వారాలపాటు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే రోవర్ నిద్రాణ స్థితిలోకి వెళ్లగా.. తాజాగా ల్యాండర్ కూడా అందుకు సిద్ధమైంది. ఈ రోజు ల్యాండర్ విక్రమ్ స్లీప్ మోడ్లోకి వెళ్లనుందని ఇస్రో ప్రకటించింది. అంతకుముందు జరిపిన హాప్ ఎక్స్పరిమెంట్ అనంతరం కొత్త ప్రదేశంలోనూ అందులోని పేలోడ్లు పనిచేసినట్లు తెలిపింది.
‘భారత కాలమాన ప్రకారం.. 8 గంటల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. అంతకుముందు జరిపిన ప్రయోగం తర్వాత.. కొత్త ప్రదేశంలోనూ అందులోని రాంభా, చాస్టే, ఐఎల్ఎస్ఏ పేలోడ్లు పనిచేశాయి. వాటి సమాచారం భూమికి చేరింది. పేలోడ్లన్నీ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయ్యాయి. ల్యాండర్ రిసీవర్లు మాత్రం ఆన్లోనే ఉన్నాయి. సౌరశక్తి తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది. సెప్టెంబర్ 22న మళ్లీ తిరిగి అవి మేలుకుంటాయని ఆశిస్తున్నాం’ అని ఇస్రో (ISRO) వెల్లడించింది. ఇక హాప్ ఎక్స్పరిమెంట్ జరిగే ముందు, ఆ తర్వాత ల్యాండర్ స్థితికి సంబంధించిన ఫొటోలనూ ఇస్రో పోస్టు చేసింది.
ISRO: మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్
ఇదిలాఉంటే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం జులై 14న ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగించింది. అనంతరం 40 రోజులపైగా ప్రయాణం చేసిన చంద్రయాన్.. ఆగస్టు 23న జాబిల్లిపై విజయవంతంగా దిగింది. అనంతరం శాస్త్రవేత్తలు నిర్దేశించిన విధంగా పనిచేసిన ల్యాండర్, రోవర్లు అక్కడ పరిశోధనలు చేపట్టాయి. వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు భూమికి చేరవేశాయి.
ఆ తర్వాత ఏం జరుగుతుంది..?
సోలార్ ప్యానెల్ల ద్వారా శక్తి పొందే విక్రమ్, ప్రజ్ఞాన్ల జీవితకాలం 14 రోజులే. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు. సూర్యాస్తమయం సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్, రోవర్ వ్యవస్థలు మనుగడ సాగించడం సాధ్యం కాదు. 14 రోజుల తర్వాత మళ్లీ అక్కడ సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో ల్యాండర్, రోవర్లపై సూర్యరశ్మి పడి, మళ్లీ అవి పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే సూర్యకాంతిని అందుకునేలా రోవర్ ఫలకం దృక్కోణాన్ని మార్చారు. సెప్టెంబర్ 22న వచ్చే సూర్యోదయంతో ఒకవేళ అవి పనిచేస్తే మాత్రం అదనపు ప్రయోజనమేనని భారత శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లేదంటే.. చంద్రుడిపై అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు