Operation Cactus: ‘ఆపరేషన్ కాక్టస్’.. నాడు మాల్దీవుల్లో భారత సైన్యం అడుగుపెట్టిన వేళ..
Maldives-India: దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం మాల్దీవుల్లో భీకర తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో భారత బలగాలు ఈ దీవుల్లో అడుగుపెట్టి ఆ దేశ ప్రభుత్వాన్ని రక్షించాయి. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది? ఏంటా ఆపరేషన్ కాక్టస్..?
ఇంటర్నెట్ డెస్క్: భారత (India) ప్రధాని మోదీ, లక్షద్వీప్పై మాల్దీవుల (Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చైనా అండతో దూకుడుగా ప్రవర్తిస్తున్న ఈ మాల్దీవులను.. ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి భారతే రక్షించింది. మన సైన్యం ఆ దీవుల్లో అడుగుపెట్టి శత్రుమూకలను తరిమికొట్టింది. ప్రపంచ దేశాలు కొనియాడిన ఆ ‘ఆపరేషన్ కాక్టస్ (Operation Cactus)’ గురించి తెలుసా..?
వ్యాపారి తిరుగుబాటుతో కల్లోలం..
1988 నవంబరులో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ.. అప్పటి మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం (PLOTE) గ్రూప్ ఆయనకు సాయం చేసింది. నవంబరు 3 తెల్లవారుజామున ఈ గ్రూప్నకు చెందిన 80 మందితో కూడిన కిరాయి సైన్యం.. శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలె చేరుకుంది. వీరు మాల్దీవుల్లో బీభత్సం సృష్టించారు. పోర్టులు, రేడియో స్టేషన్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడి భవనం దిశగా దూసుకెళ్లారు. తిరుగుబాటు గురించి తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే అధ్యక్షుడు గయూమ్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీధుల్లో కాల్పులతో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది.
సాయం కోసం భారత్ను అభ్యర్థించి..
గయూమ్పై గతంలోనూ రెండుసార్లు ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పరిణామాలు ఇంత తీవ్ర స్థాయిలో లేవు. కానీ, ఈసారి ఎదురైన ముప్పు నుంచి బయటపడే పరిస్థితి కన్పించలేదు. దీంతో సాయం కోసం గయూమ్ పొరుగు దేశాలను ఆశ్రయించక తప్పలేదు. కానీ, వారికి సాయం చేసేందుకు శ్రీలంక, పాకిస్థాన్, సింగపూర్ నిరాకరించాయి. అగ్రరాజ్యం అమెరికా సాయానికి ముందుకొచ్చినా.. సైన్యాన్ని పంపేందుకు రెండు, మూడు రోజులు పడుతుందని చెప్పింది. దీంతో గయూమ్.. అప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్కు ఫోన్ చేశారు. అయితే, బ్రిటన్ సైన్యం కూడా ఈ దీవులకు చాలా దూరంలో ఉంది. దీంతో భారత్ను సాయం అడగాలని ఆమె సూచించారు. మరో ఆలోచన లేకుండా ఆయన భారత్ను అభ్యర్థించారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. మన సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు.
అలా ఆపరేషన్ కాక్టస్..
ప్రధాని కార్యాలయం నుంచి విదేశీ సేవల అధికారి.. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వీఎన్ శర్మకు ఫోన్ చేశారు. ‘‘మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. శ్రీలంకకు చెందిన తీవ్రవాదులు ఆ దీవుల్లోకి ప్రవేశించి మాలెను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు గయూమ్ ఓ పౌరుడి ఇంట్లో తలదాచుకున్నారు. మంత్రులు బందీలుగా ఉన్నారు. మన సైన్యం సాయం చేయగలదా?’’ అని ఆ అధికారి అడిగారు. వీఎన్ శర్మ.. ‘తప్పకుండా చేయగలం’ అని చెప్పారు. దీనికి ‘ఆపరేషన్ కాక్టస్’ అని కోడ్ నేమ్ పెట్టారు.
బ్రిగేడియర్ ఫారూఖ్ బల్సారా నేతృత్వంలో ఆగ్రా నుంచి మూడు పారాకమాండో బృందాలు మాలె అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వెంటనే ఎయిర్పోర్టును తమ అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలె నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించింది. మన కమాండోల దెబ్బకు వారు తోకముడిచి పారిపోయారు.
అదే సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బెత్వా.. ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నారు. ఈ పోరులో ఇద్దరు బందీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు. ‘ఆపరేషన్ కాక్టస్’ విజయవంతమవడంపై ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసించాయి.
మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు..
ఈ ఆపరేషన్లో భారత్ అదుపులోకి తీసుకున్న శ్రీలంక కిరాయి ముఠా సభ్యులను 1989లో మాల్దీవులకు అప్పగించారు. తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహిమ్ నజీర్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడు గయూమ్ క్షమాభిక్ష ప్రసాదించారు.
ఈ ఆపరేషన్ తర్వాత భారత్, మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే భారత్కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తాయి. ఈ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జు కోరడం వివాదాస్పదమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!