Wuhan: వుహాన్పై ‘డ్రాస్టిక్’ చెప్పిన విషయాలు..!
వుహాన్ ల్యాబ్ లీకు విషయంలో ఒక ఓపెన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు
22,000 వైరస్ నమూనాల సమాచారం మాయం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వుహాన్ ల్యాబ్ లీకు విషయంలో ఒక ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఉత్సాహవంతులు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. డ్రాస్టిక్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపు.. వుహాన్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, పత్రాలను బహిర్గతం చేస్తోంది. దీనిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. వుహాన్ ల్యాబ్ వైరస్ డేటా బేస్ను కొవిడ్ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు ఆన్లైన్ నుంచి తొలగించడాన్ని ఈ గ్రూప్ ప్రశ్నిస్తోంది.
హ్యాకర్ల ముప్పుగా చెబుతున్న చైనా..
2019లో కరోనావైరస్ సమాచారాన్ని ఆన్లైన్ నుంచి చైనా తొలగించింది. దీనిలో 22,000 వైరస్ నమూనాల సమాచారం ఉంది. వీటి జన్యుక్రమాల వివరాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం వెళ్లినప్పుడు.. చైనా శాస్త్రవేత్త షీజింగ్ లీని ఈ అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దానికి ఆమె.. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉండటంతో ఆ సమాచారం కోసం హ్యాకర్లు యత్నాలు చేస్తున్నారనీ.. ఆ కారణంగా ఆన్లైన్ నుంచి ఆ డేటాను తొలగించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ డేటాను 2019లో సెప్టెంబర్లో తొలగించారు. అంటే వైరస్ వ్యాప్తి బాహ్యప్రపంచానికి తెలియడానికి దాదాపు మూడు నెలల ముందన్నమాట. అప్పుడు కొవిడ్19 గురించి ప్రపంచానికి తెలియదు కదా..? హ్యాకర్లు ఆ సమాచారం కోసం ఎందుకు ప్రయత్నిస్తారు..? లేకపోతే సెప్టెంబర్లోనే షీజింగ్ లీకు వైరస్ వ్యాప్తి విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే కొవిడ్-19 చైనా చెబుతున్నట్లు డిసెంబర్లో మొదలు కాలేదని దాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2018లో అమెరికా ఆందోళన..
వుహాన్ పేరుకు మాత్రమే పీ-4 స్థాయి ప్రయోగశాల. అక్కడ కనీసం భద్రతా చర్యలు కూడా తీసుకోరనే ఆరోపణలు గతం నుంచే ఉన్నాయి. ఆ ల్యాబ్ను అమెరికాకు చెందిన కొందరు అధికారులు 2018లో సందర్శించారు. ఈ క్రమంలో వారు అక్కడి భద్రతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించారు. అక్కడ పనిచేసే వారికి కూడా ప్రొటోకాల్స్ పాటించే విషయంలో సరైన శిక్షణ లేదని గమనించారు. ఆ ల్యాబ్లో వైరస్లను భద్రపర్చే రిఫ్రిజిరేటర్ దెబ్బతిన్న చిత్రాన్ని గతేడాది పశ్చిమ దేశాల పత్రికలు ప్రచురించాయి.
చైనా సైనిక కార్యకలాపాలు..
వుహాన్ ల్యాబ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జోక్యం ఎక్కువగానే ఉందని గతేడాది ‘ఎపోక్టైమ్స్’ పత్రిక కథనం పేర్కొంది. దాని ప్రకారం.. 2002లో సార్స్ వ్యాపించడంతో.. భవిష్యత్తులో ఇటువంటి వైరస్లను అడ్డుకోవడానికి పీ4ల్యాబ్ నిర్మించేందుకు సాయం చేయాలని ఫ్రాన్స్ను ‘ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ కోరింది. దీనికి నాటి ఫ్రాన్స్ ప్రధాని రాఫారిన్ అంగీకరించారు. దీనికి ఫ్రాన్స్కు చెందిన ఆర్టీవీ అనే సంస్థ ఇంజినీరింగ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, దానిని తొలగించి చైనా సైన్యంతో సంబంధాలున్న ఐపీపీఆర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి అక్కడ బయోకెమికల్ ఆయుధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని ఫ్రాన్స్ అనుమానిస్తోందని ఈ కథనం పేర్కొంది.
వైరస్ లీకవ్వగానే సైన్యం రంగ ప్రవేశం..
వుహాన్లో కరోనావైరస్ వ్యాపించిన సమయంలో జంతువుల నుంచి వచ్చిన అంటు రోగంగా ప్రచారం జరుగుతున్న సమయంలో వుహాన్ ల్యాబ్ నిర్వహణను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి తీసుకొంది. జనవరి 2వ తేదీనే వుహాన్లో వ్యాపించిన గుర్తుతెలియని నిమోనియా గురించిన వివరాలు ఎక్కడా మాట్లాడకూడదని ల్యాబ్ డీజీ నుంచి అందరికీ ఆదేశాలు వెళ్లాయి. పైగా దానికి సంబంధించిన పరిశోధన పత్రాలు ప్రచురించవద్దని పేర్కొన్నారు. పక్షం రోజుల తర్వాత ఆ ల్యాబ్ పగ్గాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బయోకెమికల్ నిపుణురాలు చెన్ వుయ్ చేతికి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకే చైనాలో బయో సెక్యూరిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అధ్యక్షుడు షీజిన్పింగ్ ప్రకటించారు. అక్కడి వైరస్ నమూనాల మొత్తాన్ని సీల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ పనిచేసిన ఒక మహిళా ఉద్యోగి వివరాలను ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నుంచి తొలగించారు. ఆమె తొలి పేషెంట్ అనే అనుమానాలు ఉన్నట్లు నాటి ‘ఎపోక్ టైమ్స్’ కథనంలో పేర్కొంది. ఇక వైరస్ వ్యాప్తి విషయాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ వంటి వారిని చైనా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. వాస్తవానికి నికార్సైన దర్యాప్తు జరిగి వాస్తవాలు తెలిసేవరకూ వుహాన్ ల్యాబ్పై అనుమానపు మేఘాలు కమ్ముకునే ఉంటాయి. మరోపక్క చైనా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తునకు అనుమతి ఇవ్వకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా