Wildfire: కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు
అతిపెద్ద కార్చిచ్చు అమెరికాలోని కాలిఫోర్నియాలో బీభత్సం సృష్టిస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద అగ్నికి ఆహుతవుతోంది. 108 ఏళ్లలో అత్యంత తీవ్రంగా చెప్పుకుంటున్న ఈ కార్చిచ్చుకు తోడు....
లక్షల ఎకరాల అటవీ సందప ఆగ్నికి ఆహుతి
కాలిఫోర్నియా: అతిపెద్ద కార్చిచ్చు అమెరికాలోని కాలిఫోర్నియాలో బీభత్సం సృష్టిస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద అగ్నికి ఆహుతవుతోంది. 108 ఏళ్లలో అత్యంత తీవ్రంగా చెప్పుకుంటున్న ఈ కార్చిచ్చుకు తోడు పెద్దఎత్తున వేడి గాలులు తోడయ్యాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దావాగ్నిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అగ్నిమాపక దళం తీవ్రంగా కృషి చేస్తోంది.
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పటికే పది రాష్ట్రాలకు దావానలంలా వ్యాపించింది. అలస్కా నుంచి వ్యోమింగ్ వరకు ఉన్న అడవిని దహించి వేస్తోంది. దాదాపు 60 ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలిఫోర్నియాలో భారీగా ఎగసిపడుతున్న మంటల ధాటికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. అరిజోనా, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లోని అధిక అటవీ భాగాన్ని మంటలు ఆక్రమించేశాయి. మంటల ధాటికి అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని అమెరికా వాతావరణ విభాగం తెలిపింది. జులై 13 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు ప్రకటించినా.. కాలిఫోర్నియా సహా కొన్ని రాష్ట్రాల్లో ఆ సూచనలు కనిపించలేదు.
రెండు వేల ఇళ్లు దగ్ధం
మంటలకు భారీ వేడిగాలులు తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. వేడిగాలుల ధాటికి మరింతగా ఎగసిపడుతున్న మంటలు వృక్ష సంపద, జంతుజాలాన్ని హరించివేస్తోంది. ఫ్లూమాస్ నేషనల్ ఫారెస్ట్లో 362 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని మంటలు ఆక్రమించాయని యోస్మైట్ నేషనల్ పార్క్లో 36 చదరపు కిలోమీటర్ల పరిధిలో దావాగ్ని వ్యాపించిందని అమెరికా అటవీ అధికారులు తెలిపారు. క్లామత్ కౌంటీ పట్టణంలోని ఫ్రీమాంట్ వైన్మా నేషనల్ పారెస్ట్లో 621 చదరపు కిలోమీటర్ల అడవిని మంటలు చుట్టుముట్టాయి. ఇప్పటివరకు రెండు వేల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు వెల్లడించారు. నెవెడా అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో మూడువేల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
1500 మంది అగ్నిమాపక సిబ్బంది
కార్చిచ్చు, వేడి గాలలు ప్రభావానికి కాలిఫోర్నియా ఉత్తర పర్వత ప్రాంతాల్లోని నివాస గృహాలు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యాయి. మంటలు ఎగసిపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కార్చిచ్చును అదుపుచేసేందుకు అమెరికా అగ్నిమాపక దళం తీవ్రంగా కృషిచేస్తోంది. 1500 మంది సిబ్బంది మంటలను నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. వేలాది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కొన్ని చోట్ల విమానాల సాయంతో మంటలపై నీటిని కురిపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM