బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌.. సాహసయాత్ర

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రముఖ సాహస యాత్రికుడు..

Updated : 08 Dec 2022 16:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. అతడితో కలిసి చిత్రీకరించిన సాహసయాత్ర ఎపిసోడ్‌ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నన్నో పిచ్చోడు అనుకుంటున్నారా.. అయితే పిచ్చోళ్లే ఇలా అడవిలో సాహసాలు చేస్తారు’ అంటూ ఆ టీజర్‌కు తన వ్యాఖ్యానాన్ని జత చేశాడు. కాగా ఆ టీజర్‌ సినీ, సాహసయాత్ర ప్రేమికుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. బేర్‌ సైతం ఓ మోషన్‌ పోస్టర్‌ను పంచుకున్నాడు. ‘జీవితమే ఓ సాహసయాత్ర. ఇలా సాహసాలను ఎంజాయ్‌ చేసే వాళ్లు మరికొందరు ఉన్నారు. లెజెండరీ అక్షయ్‌ కుమార్‌ ఓ ఉత్తమ సాహస యాత్రికుడు’ అంటూ పేర్కొన్నాడు.

ఈ సాహసయాత్ర ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 11న డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 14న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు రజినీ కాంత్‌.. బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసయాత్ర చేశారు. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడిగా అక్షయ్‌ నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని