‘దృశ్యం 2’.. సన్నాహాలు

వెంకటేష్‌ హిట్‌ సినిమా ‘దృశ్యం’కు రీమేక్‌గా ఇప్పుడు ‘దృశ్యం 2’ సిద్ధమైంది. తొలి భాగంలో నటించిన మీనా, నదియా, నరేష్‌, కృతిక, ఈస్తర్‌ అనిల్‌ తదితరులు ఈ కొనసాగింపు చిత్రంలోనూ నటించారు.

Updated : 21 Sep 2021 09:37 IST

వెంకటేష్‌ హిట్‌ సినిమా ‘దృశ్యం’కు రీమేక్‌గా ఇప్పుడు ‘దృశ్యం 2’ సిద్ధమైంది. తొలి భాగంలో నటించిన మీనా, నదియా, నరేష్‌, కృతిక, ఈస్తర్‌ అనిల్‌ తదితరులు ఈ కొనసాగింపు చిత్రంలోనూ నటించారు. జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ఈ సినిమాని.. ఆంటోని పెరంబవూర్‌, రాజ్‌ కుమార్‌ సేతుపతి, సురేష్‌బాబు నిర్మించారు. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికేట్‌ అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘‘కుటుంబ భావోద్వేగాలతో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. వెంకటేష్‌ నటన మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని