‘మైఖేల్‌’గా సందీప్‌కిషన్‌

యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ పాన్‌ ఇండియా స్థాయి చిత్రంలో మెరవనున్నారు. ‘మైఖేల్‌’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విజయ్‌ సేతుపతి ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

Updated : 28 Aug 2021 07:35 IST

యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ పాన్‌ ఇండియా స్థాయి చిత్రంలో మెరవనున్నారు. ‘మైఖేల్‌’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విజయ్‌ సేతుపతి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. రంజిత్‌ జెయకోడి దర్శకుడు. శుక్రవారం టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేస్తూ ఈ సినిమాని ప్రకటించింది చిత్రబృందం. టైటిల్‌ పోస్టర్‌లో పోలీస్‌ సంకెళ్లతో రక్తంతో తడిసిన చేతులు దర్శనమిస్తున్నాయి. ఆ  పోస్టర్‌ కథలోని గాఢతని తెలియజెప్పేలా ఉంది. ‘మైఖేల్‌’గా సందీప్‌కిషన్‌ కనిపించనున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రానుందని సినీ వర్గాలు తెలిపాయి. భరత్‌ చౌదరి, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు. నారాయణదాస్‌ కె.నారంగ్‌ సమర్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని