బ్రహ్మాజీ ఇంట్లోకి చేరిన వరద నీరు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గంటల కొద్దీ ప్రయాణికులు రోడ్లపైనే వేచిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయి.....

Updated : 19 Oct 2020 16:30 IST

ఫొటోలు షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం సోమవారం మళ్లీ మొదలైంది. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిస్థితి ఇదంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోమవారం మధ్యాహ్నం సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. కాలనీ మొత్తం జలమయమైనట్లు కనిపిస్తోంది. ‘మోటర్‌ బోట్‌ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి’ అని మరో ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన ఫాలోవర్స్‌ ఫన్నీ కామెంట్లు చేశారు.

బ్రహ్మాజీ ఇంటి ఫొటోలు చూసిన నెటిజన్లు తెగ స్పందించారు. ‘అయ్యో.. పడవ కొనాలి అన్నా, మీకు ఈత వస్తే ఫర్వాలేదు, వర్షాలు ఇంకా వస్తాయని నిపుణులు చెబుతున్నారు, చిరునామా చెప్పు అన్నా.. బోట్‌ వేసుకుని వచ్చేస్తా..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. బ్రహ్మాజీ గత కొన్ని రోజులుగా ‘అల్లుడు అదుర్స్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. సోనూసూద్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నభా నటేష్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ శంషాబాద్‌లో జరుగుతోందని రెండు రోజుల క్రితం బ్రహ్మాజీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని