Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో

నటుడు సిద్ధార్థ్‌ (Siddharth)కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సినిమా కార్యక్రమానికి నిరసన సెగ తాకింది. 

Published : 28 Sep 2023 19:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు సిద్ధార్థ్‌ (Siddharth)కు చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త చిత్రం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయనకి నిరసన సెగ తాకింది. విలేకర్ల సమావేశాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు సిద్ధార్థ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘చిన్నా’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తాజాగా సిద్ధార్థ్‌ పాల్గొన్నారు. కార్యక్రమం మొదలు కాగానే కొందరు నిరసన కారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్‌ ఆపేయాలని సిద్ధార్థ్‌కు సూచించారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. నిరసన కారులు బలవంతం చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇలా జరగడం నిజంగానే బాధాకరం అని అన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని