Dhoni: సీఎస్కేలో చోటిస్తారా..? కమెడియన్కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన ధోని
‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM) ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిగా మారింది.
చెన్నై: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన సొంత సినీ నిర్మాణ సంస్థపై (Dhoni Entertainment) రూపొందించిన తొలి చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM). ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనికి తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు వీరాభిమాని అని తెలిసిన విషయమే. వీళ్లిద్దరి మధ్య ఆ ఈవెంట్లో జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
‘లెట్స్ గెట్ మ్యారీడ్’లో యోగిబాబు ఓ కీలకపాత్రలో నటించారు. ఆయన స్టేజ్పై మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తనను తీసుకోవాలని ధోనిని (Dhoni) కోరారు. దీనికి ధోనీ కూడా అంతే సరదాగా సమాధానం చెప్పారు. ‘‘మా ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాబట్టి ఆ స్థానం ఖాళీగానే ఉంది. నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను. అయితే మీరు నిలకడగా ఆడాల్సి ఉంటుంది. కానీ, మీరేమో సినిమాలతో బిజీగా ఉంటారు కదా..! నేను మీకు ముందే చెబుతున్నాను. వాళ్లు మిమ్మల్ని గాయపరచాలని మాత్రమే బౌలింగ్ వేస్తారు’’ అని చెబుతూ నవ్వులు పూయించారు ధోని.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హరీశ్ కల్యాణ్, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకాదరణ పొందుతోంది. రమేష్ తమిళమణి (Ramesh Thamilmani) దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధోనికి ఉన్న అభిమానుల్లో కమెడియన్ యోగిబాబు ఒకరు. ధోని గతంలో అతడి కోసం ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ను గిఫ్ట్గా పంపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ యోగిబాబు చేసిన ట్వీట్ అప్పట్లో వైరలైంది. ‘ఎంతో ఆనందంగా ఉంది. స్వయంగా ధోనినే తన బ్యాట్ను నాకోసం పంపాడు. ఎప్పటికీ దాచుకుంటాను. థ్యాంక్యూ సర్’ అంటూ ఈ కమెడియన్ తన ఆనందాన్ని తెలియజేశాడు. ఇప్పుడు వీరిద్దరి సంభాషణ మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.