Allu Arjun: వీరాభిమానిని కలిసిన అల్లు అర్జున్‌.. ఎమోషనల్‌ మూమెంట్‌

అల్లు అర్జున్‌ (Allu Arjun)కు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 16 Mar 2024 00:19 IST

హైదరాబాద్‌: తన అభిమానులను ఎంతో ప్రేమిస్తుంటారు నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). జీవితంలో ఒక్కసారైనా తనని ప్రత్యక్షంగా చూడాలని ఆశపడే వారిని వీలు చూసుకుని కలుస్తుంటారాయన. తాజాగా ఆయన తన వీరాభిమానిని కలిశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అభిమానిని కలిసి సరదాగా మాట్లాడారు. అతడితో ఫొటోలు దిగారు. అభిమాన నటుడిని కలిశాననే ఆనందంతో ఆ వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. హత్తుకుని కన్నీళ్లు పెట్టుకోగా.. బన్నీ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌ పరిసరాల్లో జరిగింది. గతేడాది త్రివిక్రమ్‌తో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అట్లీతోనూ సినిమా చేయనున్నారని ఇటీవల ప్రచారం జోరందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని