Gam Gam Ganesha: అన్నయ్యతో కలిసి నటిస్తానేమో!
‘‘రెండు నెలల కిందట విడుదలైన మా ‘బేబి’ ప్రేక్షకుల్ని ఎంతగా భావోద్వేగానికి గురిచేసిందో... ‘గం గం గణేశా’ అంతగా వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ.
‘‘రెండు నెలల కిందట విడుదలైన మా ‘బేబి’ ప్రేక్షకుల్ని ఎంతగా భావోద్వేగానికి గురిచేసిందో... ‘గం గం గణేశా’ అంతగా వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా... ఉదయ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, కార్తీక్ దండు, వినోద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘క్రైమ్, యాక్షన్, ఫన్ మేళవింపుగా రూపొందిన సినిమా ఇది. కథ చెబుతున్నప్పుడే చాలా ఆస్వాదించా. థియేటర్లోనూ ప్రేక్షకులకు అదే అనుభూతిని పంచుతుంది. భయం, అత్యాశ, కుట్ర నేపథ్యం ఈ సినిమాకి కీలకం. నా గత చిత్రాలతో పోలిస్తే భిన్నమైన చిత్రమిది. ప్రతి దర్శకుడికీ ఓ విజన్ ఉంటుంది. దాన్ని నమ్మే నేను చేస్తా. ఇది ‘బేబి’ సినిమాని దాటేస్తుందా లేదా అనే లెక్కలు వేసుకోను. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుంది. భవిష్యత్తులో అన్నయ్య విజయ్తో కలిసి నటిస్తానేమో’’ అన్నారు. చిత్ర దర్శకుడు ఉదయ్ శెట్టి మాట్లాడుతూ ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథ ఇది. పండగని అందరూ కలిసి సంబరంగా జరుపుకున్నట్టే ఉంటుందీ చిత్రం’’ అన్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత వంశీ కారుమంచి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!