Chiranjeevi: భుజం కాయడమే ఇష్టం.. భుజ కీర్తులు కాదు
నటుడిగా చిరంజీవి సినీ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది. కానీ, ఇప్పటికీ నటన పట్ల అదే నిబద్ధత.. అదే ఉత్సాహం. హుషారుగా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు దీటుగా జోరు చూపిస్తున్నారు.
నటుడిగా చిరంజీవి (Chiranjeevi) సినీ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది. కానీ, ఇప్పటికీ నటన పట్ల అదే నిబద్ధత.. అదే ఉత్సాహం. హుషారుగా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు దీటుగా జోరు చూపిస్తున్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ వినోదాలు పంచిస్తున్నారు. ఇప్పుడాయన ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. బాబీ (కె.ఎస్.రవీంద్ర) (Bobby) తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు చిరు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
మీరు సీనియర్ హీరో. ఈతరం దర్శకులతో పని చేస్తున్నప్పుడు ఏదైనా సీన్ బాగా రాకుంటే వాళ్లు ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నారా?
‘‘నేను చేసింది నాకెప్పుడూ తెలిసిపోతుంటుంది. మానిటర్ కూడా చూడను. కాకపోతే నేను నా ఓకే కోసం ఎదురు చూడను. దర్శకులు సీన్ ఓకే అనే వరకు ఎదురు చూస్తా. వాళ్ల నోటి నుంచి ఆ మాట వచ్చే వరకు స్పాట్ నుంచి కదలను. దర్శకుడికనే కాదు.. నృత్య దర్శకుడికి.. ఫైట్ మాస్టర్కు.. ప్రతి ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఓ కొత్త నటుడితో పని చేసేటప్పుడు వాళ్లెంత సౌకర్యంగా ఫీలవుతారో.. అలాంటి సౌకర్యాన్ని అందిస్తాను. ఎందుకంటే ఒక సినిమా బాగా రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఒకవేళ అలా కష్టపడలేకపోతే రిటైర్ అయిపోవడం మంచిది’’.
‘ఆర్ఆర్ఆర్’లోని (RRR) ‘‘నాటు నాటు’’ (Naatu Naatu) పాటకు గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) పురస్కారం రావడం ఎలా అనిపించింది?
‘‘ఇది మనమంతా గర్వించదగ్గ విషయం. ఇదొక అద్భుతమైన.. చారిత్రక విజయం. నాకైతే ఇది మరింత ప్రత్యేకం. ఇంత మంచి పాటను అందించిన కీరవాణికి (Keeravani), సాహిత్యమందించిన చంద్రబోస్కు, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్ - కాలభైరవకు, నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్కు, ఇందులో నటించి, మెప్పించి మనందరితో వావ్ అనిపించిన ఎన్టీఆర్, రామ్చరణ్లకు నా శుభాభినందనలు’’.
తెలుగు సినిమాకి ఇది స్వర్ణయుగం అనుకోవచ్చా?
‘‘అసలు మన తెలుగు సినిమా ఆరంభం నుంచే స్వర్ణయుగంలో ఉంది. హెచ్.ఎమ్.రెడ్డి, కేవీ రెడ్డి.. ఇలాంటి గొప్ప దర్శకులతో ఆరోజుల్లోనే ఆ యుగం మొదలైపోయింది. అదిప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఇప్పుడా స్వర్ణయుగంలో ఉచ్ఛస్థితిని చూస్తున్నాం’’.
సాధారణంగా సంక్రాంతికి ఎప్పుడూ మీరే ముందొస్తుంటారు. కానీ, ఈసారి చివరగా వస్తున్నారు ఎందుకు?
‘‘ఈ సంక్రాంతికి మా మైత్రీ సంస్థ (Mythri Movie Makers) నుంచే రెండు సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి చిత్రం ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుంది. బయ్యర్లు, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’’.
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)తో ప్రేక్షకులకు మళ్లీ ఆ వింటేజ్ చిరంజీవిని పరిచయం చేస్తున్నట్లున్నారు కదా?
‘‘హుషారుగా చేయాలన్నా.. నాకిష్టమైన టాలెంట్స్ అన్నీ బయట పెట్టుకోవాలన్నా కమర్షియల్ కథల్లోనే బాగా కుదురుతుంది. కానీ, వ్యక్తిగతంగా నేనెప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని తపన పడుతుంటాను. అందులో భాగంగానే ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ లాంటి చిత్రాలు చేశాను. కానీ, ఆ తర్వాత కాలంలో నాకేం కావాలి అని ఆలోచించడం కంటే ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందివ్వడం నా కర్తవ్యంగా భావించాను. ఇప్పుడొస్తున్న ఈ ‘వాల్తేరు వీరయ్య’ కూడా అలాంటి ప్రయత్నమే. ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో.. అవన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఈ సినిమాతో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠామేస్త్రి’ల్లో నేనెలా కనిపించానో.. ఈ ‘వాల్తేరు వీరయ్య’లోనూ అలా కనిపిస్తాను. ఇప్పటి వరకు నేనింత మాస్గా ఎప్పుడూ కనిపించలేదు. చిత్రీకరణను ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశా. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’
మీరు.. రవితేజ (Raviteja) ‘అన్నయ్య’లో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రంలో కలిసి చేశారు. ఎలా అనిపించింది?
‘‘రవితేజ ఆరోజుల్లో ఎంత సరదాగా ఉన్నాడో.. ఈరోజుకీ అలాగే ఉన్నాడు. నటన పట్ల తనకున్న ప్రేమ, వాత్సల్యం అలాగే ఉన్నాయి. రవి తన ఎనర్జీతో ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. బాబీ కథ చెప్పినప్పుడే ఈ పాత్రకు రవితేజ బాగుంటాడని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో మేమిద్దరం డైలాగులు మార్చుకున్నాం. తన ‘ఇడియట్’లోని డైలాగ్ నేను.. నా చిత్రంలోని డైలాగ్ తను చెప్పాడు. ఫ్యాన్స్కు కిక్ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్ మార్చుకున్నాం. ఈ ఆలోచన పూర్తిగా దర్శకుడు బాబీదే’’.
ఈ మధ్య ‘మీకింత అతి మంచితనం అవసరమా’ అని మీ ఫ్యాన్స్’ అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయమేంటి?
‘‘కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురుతిరిగితే ఆ క్షణానికి నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకి భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కు తగ్గుతాను. నేనెప్పుడూ అంతిమ ఫలితం చూస్తాను. అలా చూడాలంటే మనలో పరిణతి, విజ్ఞత ఉండాలి. కొంతమంది పోరాట యోధులు ఉంటారు. వాళ్లు మాట అంటారు.. అనిపించుకుంటారు’’.
ఒకప్పటికీ.. ఇప్పటికీ కథల ఎంపికలో మీ ఆలోచనా విధానం ఏమైనా మారిందా?
‘‘కథను బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. సాధారణంగా అందరూ కథలు వింటారు. కానీ, నేను చూస్తాను. కథ వింటున్నప్పుడే దాన్ని విజువలైజ్ చేసేసుకుంటా. కథలో ఎన్ని పాటలున్నాయి. ఎన్ని ఫైట్స్ ఉన్నాయని చూడను. అవన్నీ అలంకారాలుగానే భావిస్తా. కథకు సహజ సౌందర్యాన్నిచ్చేది అందులోని భావోద్వేగాలే. అందుకే కథలో ఎంత ఎమోషన్ ఉందో చూస్తా. ప్రేక్షకులు ఓ వంద రూపాయలిచ్చి సినిమాకు వస్తే నా వంతుగా వాళ్లకు నేనేం అందిస్తున్నా అనేది చూస్తా’’.
మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే అణకువతో ఉన్నారు. ఈ విషయంలో కొత్తతరానికి మీరిచ్చే సలహాలేంటి?
‘‘కొందరికి ఇలా ఉండటం సహజంగానే వస్తుంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించాలి. ఆ ఇతరులలో దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అంతా ఉంటారు. మన ప్రవర్తన అన్నింటి కంటే ముఖ్యం. అది బాగుంది కాబట్టే నాకు వరుసగా సినిమాలొచ్చాయి. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు వరుస పరాజయాలు తారసపడినా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ‘వాడికి బాగా అయ్యింది రా’ అనుకొని చుట్టూ ఉన్న వాళ్లు భుజం దించేస్తారు తప్పితే ఎవరూ జాలి కూడా చూపరు. అందుకే మన ప్రవర్తన ఎప్పుడూ సరిగా ఉండాలి’’.
దర్శకత్వం చేయాలన్న దిశగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
‘‘ఈ మధ్యే ఎవరితోనో అన్నా.. ఎన్నిరోజులని మనం ఇలాగే తెరపై కనిపిస్తూ ఉంటాం. ఏదోక రోజు తెరమరుగు అవ్వాల్సి వస్తుంది. దాన్ని సంతోషంగా స్వీకరించాలి. కాకపోతే పనిలేకుండా ఉండటం కానీ, తక్కువ పని చేయడం గానీ నాకిష్టం లేదు. హాలీవుడ్ ప్రముఖుడు క్లింట్ ఈస్ట్వుడ్ 92ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ నటిస్తూ.. దర్శకత్వం చేస్తూ ఉత్సాహంగా జీవిస్తున్నారు. ఆయన్ని చూసినప్పుడు నాకెంతో స్ఫూర్తిగా అనిపించింది. ఇలా జీవించినంత కాలం సినిమాకి సేవ చేయగలగడం కంటే కావాల్సింది ఏముంది. భవిష్యత్తులో నేను చేయాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకత్వం చేస్తా’’.
మిమ్మల్ని ఇండస్ట్రీకి పెద్ద అనొద్దని ఎందుకంటున్నారు?
‘‘ఇండస్ట్రీ పెద్ద అనే అదనపు భుజ కీర్తుల వల్ల నాకు ఒరిగేదేం లేదు. అందుకే ఆ పేరు వద్దనుకున్నా. కాకుంటే ఇండస్ట్రీకి నా రుణం తీర్చుకునే తరుణం ఆసన్నమైతే ఏ స్థాయికైనా సరే నా భుజం కాస్తాను. అండగా ఉంటాను. నాకు భుజం కాయడం ఇష్టం తప్ప.. భుజ కీర్తులు కాదు’’.
మీరు గొప్ప నటుడిగా ఉండాలనుకుంటున్నారా? మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నారా?
‘‘మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా. అది నా అదృష్టం. కానీ, అది శాశ్వతం కాదన్నది సత్యం. కానీ, ఒక మంచి మనిషి అనేది శాశ్వతం. అది కాదనలేని సత్యం. మనం చనిపోయినా అది మాత్రం నిలిచిపోతుంది. రియల్ హీరోగా ఉంటూ.. రీల్ హీరోగా ఎక్కువ కాలం కొనసాగాలని నా కోరిక’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం