ఫెంటాస్టిక్‌ ఫోర్‌తో మెగాస్టార్‌ చిరు

అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. రీఎంట్రీ తర్వాత యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా

Updated : 23 Jan 2021 04:57 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. రీఎంట్రీ తర్వాత యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాను పనిచేస్తున్న దర్శకులతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మెహర్‌ రమేశ్‌, మెహన్‌ రాజా, కొరటాల శివ, బాబీలతో చిరంజీవి సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.

‘‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురూ ఫెంటాస్టిక్‌ 4, చార్‌ కాదమ్‌’’-ట్విటర్‌లో చిరంజీవి

ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చిత్ర బృందం నటీనటుల ఎంపికలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ‘వేదాళం’ రీమేక్‌ మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని