Tollywood: సంక్రాంతి మొదలు... సంవత్సరమంతా మెరుపులు
దశాబ్ద కాలంలో ఎప్పుడూ రానన్ని సినిమాలు గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అనువాదాలతో కలుపుకుని 287 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో విజయాలు తక్కువే కానీ... ప్రేక్షకుడు మాత్రం వినోదాల జల్లులో తడిసి ముద్దయ్యాడు.
2022కి దీటుగా 2023
సిద్ధమవుతోన్న తెలుగు చిత్రసీమ
దశాబ్ద కాలంలో ఎప్పుడూ రానన్ని సినిమాలు గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అనువాదాలతో కలుపుకుని 287 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో విజయాలు తక్కువే కానీ... ప్రేక్షకుడు మాత్రం వినోదాల జల్లులో తడిసి ముద్దయ్యాడు. ఎప్పట్నుంచో ఎదురు చూసిన చిత్రాలు 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పాన్ ఇండియా చిత్రాల జోరుతో దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ స్థాయిలో చర్చని లేవనెత్తింది. సంఖ్య పరంగా... సాంకేతికత పరంగా 2023 కూడా అందుకు దీటుగానే కనిపిస్తోంది.
అగ్ర తారల చిత్రాలు ఈ ఏడాది కూడా వరుస కట్టనున్నాయి. అందులో అంచనాల్ని రేకెత్తించే కలయికల్లో సినిమాలున్నాయి... పాన్ ఇండియా ఆకర్షణలూ ఉన్నాయి. మరోవైపు పొరుగు పరిశ్రమల నుంచీ చిత్రాలు పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా భయాలు కూడా తగ్గాయి కాబట్టి... సినిమా నిర్మాణాలు మరింతగా ఊపందుకుని... చిత్రసీమలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రభాస్తో ‘సలార్’ నిర్మిస్తున్న హోంబళే ఫిలింస్ రానున్న ఐదేళ్ల కాలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడులు సినిమా రంగంపై పెట్టనున్నట్టు తెలిపింది. అలాంటి ప్రణాళికలతోనే ఉన్నాయి మరిన్ని నిర్మాణ సంస్థలు. 2023 తెలుగు చిత్రసీమకి మరింత కీలకం కానుంది.
ఒకొక్కటి కాదు..: అగ్ర కథానాయకుల్లో చాలా మంది ఈమధ్య ఏడాదికొక సినిమాతో సరిపెట్టుకుంటున్నారు. 2023లో మాత్రం ఏడాదికి రెండు సినిమాలతో అలరించనున్న కథానాయకుల జాబితా చాలానే కనిపిస్తోంది. అందులో ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ తదితర కథానాయకులు ఉన్నారు. పవన్కల్యాణ్ నుంచి కూడా ఈ సంవత్సరం రెండు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో సందడి చేయనున్న బాలకృష్ణ, ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించారు. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘భోళాశంకర్’ సినిమాతో సందడి చేయనున్నారు. ఆ సినిమా కూడా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణని పూర్తి చేసుకుంది. మహేష్బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాకి కూడా విడుదల తేదీ ఖరారయ్యింది. ‘ధమాకా’తో విజయాన్ని అందుకున్న రవితేజ, ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తోపాటు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలతో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరంభం నుంచే...
దేశంలో బలమైన చిత్ర పరిశ్రమల్లో తెలుగు సినిమా ఒకటి. 2020లో మినహా గత దశాబ్దకాలంలో ఏటా 200కిపైగానే సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాగుందంటే పొరుగు భాషల నుంచి వచ్చే సినిమాల్నీ ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఇతర పరిశ్రమలు సైతం తెలుగు ప్రేక్షకాభిరుచిని మెచ్చి ఇక్కడ విడుదల చేస్తుంటాయి. దాంతో ప్రతీ శుక్రవారం మన బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. 2023లోనూ సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి నుంచే జోరు షురూ కానుంది. ఎప్పట్లాగే పండగకి అగ్ర తారల సినిమాలు, అనువాదాలు, పరిమిత వ్యయంతో రూపొందిన చిన్న సినిమా... ఇలా పక్కా లెక్కతోనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 11, 12, 13, 14వ తేదీల్లో అజిత్ ‘తెగింపు’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’, చిరంజీవి - రవితేజల ‘వాల్తేరు వీరయ్య’, యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ కూడా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ కలిపి దాదాపు రూ.600కోట్ల వ్యయంతో రూపొందినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తర్వాత మరో వారం విరామం అంతే. ఆ వెంటనే మళ్లీ కొత్త సినిమాల జోరు షురూ కానుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి కొన్ని చిత్రాలు విడులదవుతున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో విడుదల ఖరారు చేసుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి.
పాన్ ఇండియా ఆకర్షణలెన్నెన్నో...
2022లాగే ఈ సంవత్సరం కూడా పాన్ ఇండియా మాట గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప2’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అది ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభాస్ చిత్రాలు ‘ఆదిపురుష్’, ‘సలార్’ గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ రెండూ ఈ సంవత్సరంలోనే విడుదలవుతున్నాయి. పవన్కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ కూడా పాన్ ఇండియా చిత్రమే. వేసవిలో రానున్న ఈ సినిమాతోపాటు, మరొకటి కూడా ఆయన్నుంచి వచ్చే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట. పవన్కల్యాణ్ రాజకీయ వ్యవహారాలపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుంది. రామ్చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా కూడా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ఆ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తుందని అంచనా. ఎన్టీఆర్ - కొరటాల కలయికలో సినిమా కూడా ఈ ఏడాది వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ చిత్రబృందం దానిపై ఇటీవలే స్పష్టత ఇచ్చింది. 2024 వేసవిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర తారలే కాదు, యువ కథానాయకుల చిత్రాలూ ఈసారి పోటాపోటీగా విడుదల కానున్నాయి. కల్యాణ్రామ్, నాని, నాగచైతన్య, రామ్ల చిత్రాలు శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్నాయి. గతేడాది ఆరంభంలో ఒమిక్రాన్ భయాలతోపాటు, చిత్రసీమ సమ్మె సమస్యలు వెంటాడినా సినిమాల ఉధృతి పతాకస్థాయిలో కొనసాగింది. ఈసారి అలాంటి అవాంతరాలు లేకపోతే ఆ సంఖ్య మరింత పెరగొచ్చనేది వ్యాపార వర్గాల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఇంటర్నెట్డెస్క్: 2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?