Dhanush: డీ50.. మొదలు

‘సార్‌’ విజయం తర్వాత ధనుష్‌ మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

Updated : 08 Jul 2023 14:00 IST

‘సార్‌’ విజయం తర్వాత ధనుష్‌ (Dhanush) మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తన 50వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు ధనుష్‌. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ‘డీ50 సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యింది’ అంటూ ట్విటర్‌లో తెలిపింది. ధనుష్‌ దర్శకత్వంలో రానున్న రెండవ చిత్రమిది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. విష్ణు విశాల్‌ ముఖ్యపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒక కీలక పాత్రకోసం ఎస్‌జే సూర్యతో చిత్రబృందం చర్చలు జరుపుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను 90రోజుల్లో పూర్తి చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ‘రాయణ్‌’ అనే పేరు అనుకుంటున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని