Dobaaraa: ఓటీటీలో తాప్సీ ‘దొబారా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

తాప్సీ ప్రధానపాత్రలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు.

Published : 01 Oct 2022 18:35 IST

హైదరాబాద్‌: తాప్సీ ప్రధానపాత్రలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓ యువతి చనిపోయిన అబ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే కథ. టైమ్‌ ట్రావెల్‌, డైమెన్షన్‌ అంశాలతో కథనం తీర్చిదిద్దారు. 2:12 సంఖ్యకు కథకు సంబంధం ఏంటనేది సస్పెన్స్‌. స్పానిష్‌లో విడుదలైన ‘మిరాజ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ఏక్తాకపూర్‌ ‘కల్ట్‌ మూవీస్‌’, సునీర్‌ ఖేత్రాపాల్‌ ‘అథీనా’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుమారు రూ.30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.7కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని