Drushyam 2: వెంకటేశ్‌ ‘దృశ్యం-2’కి ‘u’ సర్టిఫికెట్‌

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రాబోతుందన్న సంగతి తెలిసిందే. వెంకటేశ్‌, మీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జీతూ జోషెఫ్‌ దర్శకత్వం వహించగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తుంది.

Published : 20 Sep 2021 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం-2’ చిత్రం తెలుగులో అదే పేరుతో రాబోతుందన్న సంగతి తెలిసిందే. వెంకటేశ్‌, మీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహించగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇక దృశ్యం-2 చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ‘యూ’ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సోమవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దృశ్యంకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే ‘దృశ్యం-2’లో కృతిక, ఎస్తర్‌ అనిల్‌ కీలకపాత్రలు పోషించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా మలయాళ దృశ్యం-2 చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేశారు. ఇక తెలుగు దృశ్యం-2కి ఓటీటీ భారీ ఆఫర్లు ప్రకటించినప్పటికీ ..  ఓటీటీ రిలీజ్‌ చేయమని, థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని