స్క్రిప్టు మార్చే ప్రసక్తే లేదు: ఛార్మి

లాక్‌డౌన్‌ కారణంగా ‘ఫైటర్‌’ (పరిశీలనలో ఉంది) సినిమా స్క్రిప్టులో మార్పులు చేశారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ నటి, నిర్మాత ఛార్మిని వివరణ అడిగారు. ‘మేడం స్క్రిప్టు మార్పులు చేశారని వస్తున్న వార్తలపై దయచేసి....

Published : 20 Jun 2020 11:38 IST

నెటిజన్‌ ప్రశ్నకు రిప్లై ఇస్తూ..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ‘ఫైటర్‌’ (పరిశీలనలో ఉంది) సినిమా స్క్రిప్టులో మార్పులు చేశారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ నటి, నిర్మాత ఛార్మిని వివరణ అడిగారు. ‘మేడమ్‌ స్క్రిప్టు మార్పులు చేశారని వస్తున్న వార్తలపై దయచేసి స్పష్టత ఇవ్వండి. లొకేషన్‌తో పాటు కొన్ని అంశాల్ని కూడా మార్చారని తెలిసింది’ అంటూ బాధపడుతున్న ఎమోజీని షేర్‌ చేశారు.

దీనికి ఛార్మి సమాధానం ఇస్తూ.. ‘ఎటువంటి మార్పు చేయలేదు.. చేసే ప్రసక్తే లేదు. ‘ఫైటర్‌’ స్క్రిప్టు బ్లాక్‌బస్టర్‌.. కరోనా క్రైసిస్‌ పూర్తిగా ముగిసిన తర్వాత షూటింగ్‌ను తిరిగి ఆరంభిస్తాం. ఈ సినిమా విషయంలో మేమంతా సూపర్‌ డూపర్‌ నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే ఒరిజినల్‌ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం’ అని ప్రకటించారు.

‘ఫైటర్‌’ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. బాలీవుడ్‌ నటి అనన్యా పాండే కథానాయిక. విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారట. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వహిస్తున్నారు. తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్‌ లాక్‌డౌన్‌కు ముందు ముంబయిలో జరిగింది. మరోపక్క ఛార్మి-పూరీ కలిసి ‘రొమాంటిక్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఆకాశ్‌ పూరీ కథానాయకుడిగా నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని