వాస్తవాల బాట... వినోదాల ఆట
కల్పిత గాథలు... చారిత్రాత్మక కథలు... నిజ జీవితాలతో రూపొందే బయోపిక్లు..ఇలా రకరకాల కథలతో సినిమాలు రూపొందుతుంటాయి. ప్రేక్షకులకు ఎప్పటి కప్పుడు భిన్నమైన రుచుల్ని పంచుతుంటాయి. కొద్దిమంది జీవితాలే సినిమా కథలకి స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. అవే బయోపిక్లుగా తెరపైకొస్తున్నాయి.....
కల్పిత గాథలు... చారిత్రాత్మక కథలు... నిజ జీవితాలతో రూపొందే బయోపిక్లు..ఇలా రకరకాల కథలతో సినిమాలు రూపొందుతుంటాయి. ప్రేక్షకులకు ఎప్పటి కప్పుడు భిన్నమైన రుచుల్ని పంచుతుంటాయి. కొద్దిమంది జీవితాలే సినిమా కథలకి స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. అవే బయోపిక్లుగా తెరపైకొస్తున్నాయి. కొన్ని రచనలు సినిమాలుగా మారిపోతుంటాయి. సినిమాల్ని చూసి కూడా కొత్త సినిమా కోసం కథలు రాసేవాళ్లూ ఉన్నారు! ఇలా కథలు ఎప్పుడు ఎక్కడి నుంచి పుడతాయో ఊహించలేం. కథంటే... కథే కాదు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటనే సినిమా కథగా రూపాంతరం చెందుతుంది. అలా చాలా నిజ జీవిత సంఘటనలతో రూపొందిన సినిమాలు చాలానే! ఇప్పుడు కూడా అలాంటి కథలతో సెట్స్పై ఉన్న సినిమాలు... ఆరంభం కాబోతున్న సినిమాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ప్రపంచ సినిమాని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వాళ్లు మన సినిమాల్లోనూ మార్పులు కోరుకుంటున్నారు. కృత్రిమ కథల్ని... తర్కానికి అందని గాథల్ని చూడటం మానేశారు. చిత్రసీమ కూడా ఆ అభిరుచుల్ని గమనిస్తూ... వాస్తవికత ఉట్టిపడే కథలకి పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. దానికితోడు యువతరం పరిశ్రమలోకి అడుగు పెట్టడంతో వాళ్లే నేటి ప్రేక్షకుల ఇష్టాలకి తగిన కథల్ని సిద్ధం చేసుకుంటూ సినిమాల్ని
తెరకెక్కిస్తున్నారు. దాంతో వాస్తవ సంఘటనలతో తెరకెక్కే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ మొదలుకొని మొన్నటి ‘వైల్డ్డాగ్’ వరకు కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందినవే. మరికొన్ని ఆ దారిలో సిద్ధమవుతున్నాయి.
* ‘క్రాక్’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. తదుపరి ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం నిజ జీవిత ఘటనలతోనే కథని సిద్ధం చేస్తున్నారు. అందుకోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు, పత్రికలు తిరగేస్తూ పరిశోధన కూడా చేస్తున్నారు. కథానాయకుడు రవితేజ కూడా మరోసారి అలాంటి కథకే పచ్చజెండా ఊపేశారు. రచయిత శరత్ మండవ రవితేజ కోసం కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్క్రిప్టుని సిద్ధం చేశారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఆ చిత్రం ఇటీవలే ఆరంభమైంది.
* ‘వైల్డ్డాగ్’లో ఎన్.ఐ.ఎ అధికారిగా నటించారు నాగార్జున. ఎన్.ఐ.ఎ అధికారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్లు దేశం కోసం ఎలాంటి సాహసాలు చేస్తారనే విషయాల్ని అందులో చూపించారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ‘వైల్డ్డాగ్’ కథని రాసుకున్నట్టు ఆ చిత్ర దర్శకుడు అహిషోర్ సాల్మన్ చెప్పారు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న నాగార్జున కొత్త చిత్రం కూడా వాస్తవ ఘటనలతో రూపొందుతున్న కథే అని తెలిసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్గా ఆ సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ‘‘వాస్తవికతతో కూడిన కథల్లో నటించడం ఎప్పుడూ ఆసక్తికరమే. నటులుగా మేం కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ పనిచేస్తుంటాం. విడుదల తర్వాత ఆ సినిమాలు ప్రేక్షకులకూ కొత్త అనుభవాన్ని పంచుతాయ’’ని చెబుతారు నాగార్జున.
* యువ కథానాయకులు రానా దగ్గుబాటి, సాయితేజ్ ఒప్పుకున్న కొత్త చిత్రాలకి కూడా వాస్తవ ఘటనలే స్పూర్తి అని తెలుస్తోంది. వెంకీ అనే ఓ కొత్త దర్శకుడు రానా దగ్గుబాటితో సినిమా చేయడం కోసం 1940 నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేశారు. ఆ కథకి అప్పట్లో జరిగిన సంఘటనలే స్ఫూర్తి అని సమాచారం. అలాగే సాయితేజ్ కథానాయకుడిగా ఓ థ్రిల్లర్ రూపొందబోతోంది. ‘రంగస్థలం’ తరహాలో పీరియాడికల్ కథతో రూపొందనున్న ఆ సినిమాకి సుకుమార్ కథని సమకూర్చారు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తారు. అది కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్నదే. రానా కథానాయకుడిగా నటించిన ‘విరాటపర్వం’ కూడా కొన్ని నిజమైన ఘటనల్ని ప్రతిబింబించేదే. ‘‘సినిమా కథకి ఒక ఆలోచనో, ఒక రచనో, లేదంటే నిజంగా జరిగిన ఒక సంఘటనో స్ఫూర్తి కావొచ్చు. కానీ కథ మొత్తం ఆ ఘటనే ఉండదు. అంతిమంగా సినిమాకి తగ్గట్టుగా అందులో కల్పితాల్ని జోడించాల్సిందే. వాస్తవ ఘటనలతో సినిమా చేయడం ఎంత సులభమో, అంత కష్టం కూడా. చాలా మందికి తెలిసిన విషయాలే ఉంటాయి కాబట్టి... పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంద’’న్నారు ఓ దర్శకుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఇంటర్నెట్డెస్క్: 2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..