Super star Krishna: సాహసాల మొనగాడు తేనెమనసు బుల్లోడు
రేయి... పగలు అనే తేడా లేకుండా సినీ సీమలో అలుపెరగకుండా మెరిసింది ఓ తార. వెండితెరకు తనవైన సాహసాల వెలుగులు... ప్రయోగాల సొబగులు అద్ది సరికొత్త దారుల్ని చూపించింది ఆ ధ్రువతార. అందుకే అభిమానంతో స్వచ్ఛందంగా అంతా ‘సూపర్ స్టార్’ అన్నారు. అలా పిలిపించుకున్న ఆ తార, ధ్రువతార... మన ‘బుర్రిపాలెం బుల్లోడు’ ఘట్టమనేని కృష్ణ.
రేయి... పగలు అనే తేడా లేకుండా సినీ సీమలో అలుపెరగకుండా మెరిసింది ఓ తార. వెండితెరకు తనవైన సాహసాల వెలుగులు... ప్రయోగాల సొబగులు అద్ది సరికొత్త దారుల్ని చూపించింది ఆ ధ్రువతార. అందుకే అభిమానంతో స్వచ్ఛందంగా అంతా ‘సూపర్ స్టార్’ అన్నారు. అలా పిలిపించుకున్న ఆ తార, ధ్రువతార... మన ‘బుర్రిపాలెం బుల్లోడు’ ఘట్టమనేని కృష్ణ.
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ.... అంటూ పాడుకున్నారు కృష్ణ. నిజంగా ఆకాశం నుంచి తారే దిగి వచ్చి కృష్ణని ఆవహించిందేమో... కెరీర్ తొలి అడుగుల్లోనే స్టార్ అనిపించుకున్న ఆయన... జయాపజయాలతో సంబంధం లేకుండా దశాబ్దాల పాటు ‘సూపర్స్టార్’గా వెలిగారు.
సాహసాలకి ‘సింహాసనం’ వేసి, తాను అనుకున్నది సాధించిన ‘అసాధ్యుడు’ కృష్ణ. చిత్ర పరిశ్రమలో అప్పటికే ‘హేమాహేమీలు’ ఉన్నా... ఆరంభం నుంచే ప్రయోగాలకి పట్టం కడుతూ, పక్కన పోటీగా ఎవరు కనిపిస్తున్నా ‘అతనికంటే ఘనుడు’ అనిపించుకున్నవాడు. ‘అగ్ని పరీక్ష’ల్ని ఎదుర్కొని... ఆ తర్వాత వరస విజయాలతో రగిలిన ‘జమదగ్ని’ కృష్ణ. చిత్రసీమలో ఒక్కసారి పడ్డాక, మళ్లీ లేవడమే కష్టం అంటారు. అలాంటిది పడి లేచి ‘నెంబర్వన్’ అనిపించుకున్న ఏకైక హీరో... కృష్ణ. ‘తెలుగువీర లేవరా’ అంటూ ప్రపంచ సినిమావైపు దారిని చూపించి.. కొత్త కథ, సాంకేతికతల్ని పరిచయం చేశారు.
ఎప్పటికప్పుడు ప్రపంచ సినిమాలో మార్పులకి అనుగుణంగా కొత్త సాంకేతికతని పరిచయం చేయడంలోనూ, కొత్త కథల్ని తెలుగు తెరకి తీసుకు రావడంలోనూ ఆయన ముందున్నారు. అదే ఆయన విజయ రహస్యం.
కథానాయకుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా జైత్రయాత్ర కొనసాగించారు. తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్తోనూ, తను కథానాయకుడిగా ఎదిగేందుకు స్ఫూర్తినిచ్చిన ఏఎన్నార్తోపాటు శోభన్బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత వచ్చిన నవతరం కథానాయకులతోనూ సినిమాలు చేసి మల్టీస్టారర్ చిత్రాల మొనగాడు అనిపించుకున్నారు. అత్యధిక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన నటుడిగా కృష్ణ రికార్డులు సాధించారు. ‘‘మరో కథానాయకుడితో నటించడంలో నాకెలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. అప్పట్లో మా మధ్య మంచి వాతావరణం ఉండేది. కథలూ అలాంటివి వచ్చేవి. అందుకే, మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య అప్పట్లో ఎక్కువగా ఉండేది’’ అనేవారు కృష్ణ.
మీ పాత్ర డ్రెస్ వేసుకొని నిద్రపోండి చాలు...
కెరీర్ మొదలైన మూడో ఏట నుంచీ కృష్ణకి రోజూ మూడు షిఫ్టులూ... సినిమానే. విరామం అంటూ లేకుండా... అంతగా పనిచేశాక ఎవరైనా అలసిపోతారు, ఇంటికి వెళ్లిపోతానంటే ‘మీరు నిద్రపోయేటప్పుడు మా పాత్రకి సంబంధించిన డ్రెస్ వేసుకుని పడుకోండి. కథలోని సన్నివేశం ప్రకారం మీరు నిద్రపోతున్న సన్నివేశమైనా తీసుకుని వెళ్లిపోతాం’ అనేవారట కృష్ణతో మరో సినిమా తీస్తున్న దర్శకనిర్మాతలు. సూపర్స్టార్ కృష్ణ కెరీర్ అలా సాగింది. 1965లో ఒక్క సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రయాణం... 67లో 7 సినిమాలతోనూ, 68లో 11, 69లో 15, 70లో 16, 71లో 11, 72లో 18 చిత్రాలతో జోరుగా సాగింది. కెరీర్ మొదలైన తొమ్మిదేళ్లలోనే వంద సినిమాల్ని పూర్తి చేసిన ఘనత ఆయనది.
* తెలుగు కౌ బాయ్ (మోసగాళ్లకి మోసగాడు) ఆయనే. మన జేమ్స్బాండ్ (గూఢచారి 116) ఆయనే. వెండితెర అల్లూరి సీతారామరాజు అన్నా... ‘కురుక్షేత్రం’ అన్నా గుర్తుకొచ్చేది ఆయనే. అప్పటిదాకా తెలుగులో తెరకెక్కని నేర నేపథ్య చిత్రాల్ని చేసి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకున్న కథానాయకుడు కృష్ణ. అలాగని ఓ ముద్రకి పరిమితం కాలేదు.
* కుటుంబ కథలు, జానపద కథలు, రాజకీయ కథలు, చారిత్రాత్మక కథలతోపాటు, నవలా చిత్రాలతోనూ తనదైన ప్రతిభ చూపించి విజయాల్ని అందుకున్నారు. అల్లూరిగానే కాదు... యేసుక్రీస్తు, దేవదాసు, విశ్వనాథ నాయకుడు వంటి పలు వైవిధ్యమైన పాత్రలు చేశారు. దర్శకనిర్మాతలు రచయితలు ఎలాంటి పాత్రలతో సంప్రదించినా సరే... వెనకడుగు వేయని నైజం ఆయనది.
అల్లూరి జోలికే పోవద్దన్నా
ఏదైనా సాధించాలంటే... దేనికైనా సాహసించాలనేది కృష్ణ నమ్మిన సిద్ధాంతం. ఆ ధైర్యమే ఆయన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. కృష్ణ చేసిన ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’ సంచలన చిత్రాలు. వాటికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్కి ఇష్టమైన పాత్ర... అల్లూరి సీతారామరాజు. అందులో నటించాలని ఆయనకి ఎప్పట్నుంచో కోరిక. ఇంతలో నిర్మాత డి.ఎల్.నారాయణ తాను సిద్ధం చేయించిన స్క్రిప్ట్ని కృష్ణ చేతిలో పెట్టారు. అది నచ్చి... సొంత సంస్థ పద్మాలయా సంస్థ నిర్మాణంలో ‘అల్లూరి సీతారామారాజు’ సినిమాని ప్రకటించారు కృష్ణ. పరిశ్రమ నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. ఎన్టీఆర్ కూడా ‘వద్దు బ్రదర్’ అని వారించారు. భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ‘కురుక్షేత్రం’ తీయండి, నేను కాల్షీట్లు ఇస్తా అని ముందుకొచ్చారు. వెనక్కి తగ్గని కృష్ణ సాహసానికి సై అన్నారు. అన్నగారూ... నేను నిర్ణయం తీసేసుకున్నా. మీకు ఇష్టమైన పాత్ర కదా, మీరు వెంటనే ఈ సినిమా చేస్తానంటే నేను సంతోషంగా వెనక్కి తగ్గుతా. లేదంటే నేను చేస్తా’ అని చెప్పి వచ్చేశారు. ఎన్టీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో సినిమా మొదలు పెట్టారు. పది రోజులు చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇంతలో చిత్ర దర్శకుడు కన్నుమూశారు. కానీ ఆయన కోరిక మేరకు కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి సినిమాని పూర్తి చేశారు. తెరపై దర్శకుడిగా పేరు మాత్రం రామచంద్రరావుదే. అందులోని పోరాట ఘట్టాలకు మాత్రం కె.ఎస్.ఆర్.దాస్ నేతృత్వం వహించారు. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాష్కెంట్ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. ఆ తర్వాత పన్నెండేళ్లకి ఆ సినిమాని చూసిన ఎన్టీఆర్ ‘కృష్ణగారు గొప్పగా తీశారు. మనం కొత్తగా అందులో తియ్యటానికేమీ లేదు. ఆ పాత్రని చేయాలనే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం’ అన్నారట. ఆయన 125వ చిత్రంగా విడుదలైన ‘కురుక్షేత్రం’ కూడా ఓ సంచలనమే. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ‘దానవీర శూరకర్ణ’కి పోటీగా వచ్చిన చిత్రంగా ‘కురుక్షేత్రం’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ వద్దన్నా కొన్ని కారణాలతో ఆ సినిమాని చేశారు కృష్ణ. 1977 జనవరి 14నే ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’, కృష్ణ నటించి, నిర్మించిన ‘కురుక్షేత్రం’ విడుదలయ్యాయి. అందులో ‘దానవీర శూరకర్ణ’ ఘన విజయం అందుకోగా, ‘కురుక్షేత్రం’ మేకింగ్ ప్రేక్షకులు, పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కృష్ణ కెరీర్లో ఓ మైలురాయి చిత్రం ‘సింహాసనం’. సాంకేతికత అంతగా లేని రోజుల్లో నేటి బాహుబలి తరహాలో చేసిన జానపద చిత్రం ఇది.
నిర్మాతల హీరో
ఆ రోజుల్లో నిర్మాతల హీరోగా అవతరించారు కృష్ణ. ఆయన చుట్టూ పదుల సంఖ్యలో నిర్మాతలే. ఎన్టీఆర్, ఏఎన్నార్ల సినిమాలకి అయ్యే నిర్మాణ వ్యయంలో సగంతో కృష్ణ సినిమాలు పూర్తయ్యేవి. ఆయన సినిమాల్లో కొత్తతరం నటులే ఎక్కువగా కనిపించేవారు. దాంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడేవారు. కృష్ణ కూడా తన పారితోషికం కంటే, నిర్మాత గురించే ఎక్కువగా ఆలోచించేవారు.
* హీరోగా కృష్ణ తెర పరిచయమే ఓ సంచలనం. ఆయన తొలి చిత్రం ‘తేనె మనసులు’ తొలి సాంఘిక వర్ణచిత్రం. కొత్తతరంతో తీసిన ఆ సినిమాని రంగుల్లో తీస్తే బాగుంటుందని ఆదుర్తి సుబ్బారావు అనుకోవడంతో అలా తెరకెక్కింది. అది మొదలు పలు తొలి రికార్డులన్నీ కృష్ణ పేరుపైనే. తొలి తెలుగు కౌబోయ్ చిత్రం ‘మొసగాళ్ళకు మొసగాడు’. తొలి స్కోపు చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. తొలి తెలుగు అపరాధ పరిశోధక చిత్రం ‘గూడచారి 116’. తొలి 70 ఎం.ఎం, సిక్స్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ చిత్రం ‘సింహాసనం’. ‘తెలుగువీర లేవరా’ తొలి డీటీఎస్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కృష్ణ చలవే. పొరుగు పరిశ్రమలకి కూడా అత్యాధునిక సాంకేతికతని తన పద్మాలయా సంస్థ నుంచి పరిచయం చేశారాయన.
ఒక సినీ శకం ముగిసింది
కృష్ణ మరణంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ తరం సినీ శకం ముగిసింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి వెండితెర బొమ్మ రంగులద్దుకున్న వరకు తెలుగు చిత్రసీమ ఖ్యాతినీ.. కీర్తిని భుజస్కంధాలపై మోసింది ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజుల తరమే. ఆ తరం సినీ హీరోలనగానే తెలుగు సినీప్రియుల మదిలో మెదిలే అగ్ర తారలంతా వీరే. వాళ్లంతా ఒకొక్కరిగా ప్రేక్షకుల్ని కన్నీటి సంద్రంలో ముంచి దివికేగారు. ఎన్టీఆర్ 1996లో లోకాన్ని వీడగా.. శోభన్బాబు 2008లో.. ఏయన్నార్ 2014లో కాలం చేశారు. ఇక ఆ తరానికి ప్రతినిధులుగా మిగిలి ఉన్న కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్ 11న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇప్పుడు కృష్ణ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక తరం కనుమరుగైనట్లయింది.
మహేష్కి ఇది తీరని శోకం
కథానాయకుడు మహేష్బాబుని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పది నెలల కాలంలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఆయనకి ఇది అత్యంత క్లిష్టమైన సమయం. మహేష్ సోదరుడు రమేష్బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మహేష్బాబు మాతృమూర్తి ఇందిరాదేవి సెప్టెంబరులో వయోభారంతో కన్నుమూశారు. మంగళవారం తన తండ్రి కృష్ణని కూడా కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
‘‘రిస్క్ తీసుకోకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేం. సాధించాలనుకుంటే రిస్క్ చేయాలి. ఇది నా తత్వం. నేను ఏదనుకంటే అది చేసేసేవాణ్ని. ఇఫ్ అండ్ బట్స్ ఆలోచించేవాణ్ని కాదు. ‘సీతారామరాజు’ సినిమా తీస్తాననగానే పరిశ్రమలో అందరూ నవ్వారు. హీరోయిన్ ఉండదు, కాషాయ వస్త్రాలతో ఉంటాడు. ఎవరు చూస్తారీ సినిమా? అన్నారంతా. సినిమా రిలీజ్ చేయడానికి ఒక్క డిస్ట్రిబ్యూటరూ రాలేదు. బలవంతంగా తారకరామ వాళ్ల చేత చేయించాం. తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే’’.
‘‘ఎన్ని ఫ్లాపులొచ్చినా మళ్లీ హిట్లొస్తాయన్న నమ్మకం నాకుండేది. ‘కృష్ణ ఇక అయిపోయాడు అని ఎన్నోసార్లు చాలామంది కామెంట్ చేశారు. వాళ్లే మళ్లీ నాకు హిట్స్ రావడంతో ‘అబ్బే...కృష్ణ కృష్ణే’ అనేవారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్