సంక్షిప్త వార్తలు(4)
‘ది నైట్ మేనేజర్’ వెబ్సిరీస్తో ప్రేక్షకులను అలరించాడు ఆదిత్యరాయ్ కపూర్. థ్రిల్, డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మరో థ్రిల్లర్ చిత్రం ‘గుమ్రా’లో కనిపించనున్నాడు.
ఒక హత్య... ఒకేలా ఉండే ఇద్దరు అనుమానితులు
‘ది నైట్ మేనేజర్’ వెబ్సిరీస్తో ప్రేక్షకులను అలరించాడు ఆదిత్యరాయ్ కపూర్. థ్రిల్, డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మరో థ్రిల్లర్ చిత్రం ‘గుమ్రా’లో కనిపించనున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని వర్ధన్ కేత్కర్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తోంది మృణాల్. సస్పెన్స్లతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక యువకుడి హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తిస్తారు. కానీ ఆ ఇద్దరూ ఒకే రకమైన పోలికలతో ఉండటంతో హంతకుణ్ని కనిపెట్టడం సవాల్గా మారుతుంది. మరి చివరికి ఎలా ఆ కనిపెట్టారో అనేది ఆసక్తికరం. ఈ సినిమాతో తొలిసారి ఆదిత్యరాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం ‘థడం’కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది.
‘పరారీ’ ఏమో!
యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ తెరకెక్కించిన చిత్రం ‘పరారీ’. జి.వి.వి.గిరి నిర్మాత. సుమన్, మకరంద్ దేశముఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘ఏమో ఏమో’’ గీతాన్ని నటి విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఈ ‘ఏమో ఏమో’ పాటను సాయి చరణ్, సురభి శ్రావణి చక్కగా ఆలపించారు’’ అన్నారు. ‘‘విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. విజయశాంతి మా పాటను విడుదల చేసి.. నా డ్యాన్స్ను మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు హీరో యోగేశ్వర్.
కృష్ణగాడంటే ఒక రేంజ్
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్ దొండపాటి తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్కె శ్రీలత సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్ను దర్శకుడు శ్రీవాస్ విడుదల చేశారు. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. కామెడీ, రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: సాబు వర్గీస్, ఛాయాగ్రహణం: ఎస్.కె.రఫి.
కశ్మీర్ ప్రయాణం ముగిసింది
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’. ‘మాస్టర్’ వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. సంజయ్ దత్, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొన్నాళ్లుగా కశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుదీర్ఘ షెడ్యూల్ తాజాగా పూర్తయినట్లు సమాచారం. త్వరలో చెన్నైలో మరో కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్, సంజయ్ దత్లతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్ దాదాపు 15రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం హైదరాబాద్కు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..