పంజాబీ గాయకుడి బయోపిక్ ‘చమ్కీలా’
తన పాటలతో పంజాబీ ప్రజలను ఆకట్టుకున్న సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా. ఆ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డింగ్స్లో అమర్ సింగ్ చేసినవే ఎక్కువ.
తన పాటలతో పంజాబీ ప్రజలను ఆకట్టుకున్న సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా. ఆ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డింగ్స్లో అమర్ సింగ్ చేసినవే ఎక్కువ. 27 ఏళ్ల వయసులోనే మరణించిన ఆయన జీవితం ఆధారంగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చమ్కీలా’. అమర్ సింగ్ పాత్రలో దిల్జీత్ దోసంజా కనిపించగా, ఆయన భార్య అమర్జోత్ కౌర్ పాత్రలో పరిణీతి చోప్రా నటించనుంది. మంగళవారం ఆ సినిమా టీజర్ను చిత్రబృందం నెట్ఫ్లిక్స్లో విడుదల చేసింది. ఆ సినిమాలో తలపాగా లేకుండా దిల్జీత్ కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ బయోపిక్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిత్రంలోని తన పాత్ర గురించి దిల్జీత్ మాట్లాడుతూ..‘‘ అమర్ సింగ్ పాత్ర పోషించడం నా జీవితంలో సవాలుతో కూడిన అనుభవం. ఓటీటీలో మరోకొత్త తరహా కథతో మీ ముందుకు రావడం చాలా ఆసక్తిగా ఉంది. ఈ అద్భుతమైన కథ కోసం సినీబృందం, పరిణీతితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో ఈ పాత్రకోసం దర్శకుడు నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. తప్పక అమర్ సింగ్ పాత్రకు న్యాయం చేస్తానన్న నమ్మకం నాకుంది’’ అని అన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
ఏసుక్రీస్తుపై మరో సినిమా
ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కార్సీస్ ఈ ప్రాజెక్టు చేపడతానంటూ ప్రకటించారు. నటుడు, నిర్మాత, స్క్రిప్టు రచయిత దర్శకుడు, అయిన మార్టిన్ పోప్ ఫ్రాన్సిస్తో వాటికన్సిటీలో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. ‘పోప్ విజ్ఞప్తి మేరకు ఒక కళాకారుడిగా నేను నాదైన శైలిలో స్పందిస్తున్నా. నా ఊహాశక్తితో జీసస్ క్రైస్ట్పై ఓ మంచి సినిమా తీసేలా స్క్రిప్టు రాయాలనుకుంటున్నా’ అన్నారు. వాటికన్ సిటీలో జరిగిన గ్లోబల్ ఈస్తటిక్స్ ఆఫ్ ది కాథలిక్ ఇమాజినేషన్ సమ్మేళనంలో ఆయన పోప్ను కలుసుకున్నారు. మార్టిన్ చివరిసారిగా ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో హాలీవుడ్ స్టార్లు లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నీరో, లిల్లీ గ్లాడ్స్టోన్లు నటించారు.
తెరపైకి గోద్రా అల్లర్లు
గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం, తదనంతరం చెలరేగిన అల్లర్ల సంఘటనల ఆధారంగా ‘యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ గోద్రా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ఎం.కె.శివాక్ష్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. గోద్రా రైలు దహనం, ఆపై మత ఘర్షణలు చోటు చేసుకోవడం వెనక ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా? అనే కోణంలో మా కథ సాగుతుందంటున్నాయి చిత్రవర్గాలు. ‘వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం’ అని టీజర్ ప్రారంభంలో కనిపిస్తోంది. గుజరాత్ మత ఘర్షణలపై విచారణ కోసం ఏర్పాటైన నానావతి కమిషన్ నివేదిక ఆధారంగానూ కథ సాగుతోందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘ఐదేళ్ల సుదీర్ఘమైన పరిశోధనలో ఈ ఘటనల వెనక దాగిన ఎన్నో నివ్వెరపోయే వాస్తవాలు కనుగొన్నాం. తగినన్ని సాక్ష్యాలతో వాటిని సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాం’ అని సినీ వర్గాలు తెలిపాయి. బీజే పురోహిత్, రాంకుమార్ పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
Arya: ‘అ అంటే అమలాపురం’.. 20 ఏళ్లయినా అదే గ్రేస్తో అదరగొట్టిన అభినయశ్రీ!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ను మలుపు తిప్పిన చిత్రంగా ‘ఆర్య’ నిలిచిపోతుంది. అప్పట్లో ఈ సినిమాలోని ‘‘అ అంటే అమలాపురం..’’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాటలో అభినయశ్రీ తన డ్యాన్స్తో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన వేడుకలో ఆమె మరోసారి అదే పాటకు స్టెప్పులేసి అలరించింది.
-
Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్ని ట్రాక్లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న.. కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM